గత నాలుగు రోజుల నుంచి నాగచైతన్య, సమంతల గురించి ఓ రూమర్ బాగా వైరల్ అవుతోంది. సమంత మరో మూడు రోజుల్లో ఖుషి మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ లో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించారు. శివ నిర్వాణ ఈ మూవీకి దర్శకుడు. సెప్టెంబర్ 1న ఖుషి పాన్ ఇండియా రేంజ్ లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.
గత పది రోజుల నుంచి మేకర్స్ విసృతంగా ప్రచారకార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల ఓ సినిమా చూసేందుకు నాగ చైతన్య హైదరాబాద్ లోని ఓ థియేటర్ కు వెళ్లాడట. అయితే అక్కడ విరామ సమయంలో ఖుషి ట్రైలర్ ను ప్రదర్శించగా.. అది చూడలేక నాగ చైతన్య బయటకు వెళ్లిపోయాడంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై నాగచైతన్య స్పందించాడు. అంత సీన్ లేదంటూ తేల్చేశాడు.
ఓ ఇంగ్లీష్ పత్రికలో మాట్లాడుతూ.. అదొక చెత్త రూమర్ అని.. అందులో ఎటువంటి నిజం లేదని నాగచైతన్య స్పష్టత ఇచ్చాడు. కొన్ని తెలుగు వెబ్సైట్స్ ప్రచురించిన ఈ వార్త నా దృష్టికి వచ్చిందని.. ఇప్పటికే వారికి ఓ క్లారిటీ ఇచ్చామని చైతు తెలిపాడు. కాగా, నాగచైతన్య-సమంత 2017లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఎక్కువ కాలం కలిసి ఉండలేదు. 2021లో వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయాడు. అప్పటి నుంచి వీరికి సంబంధించి ఏ చిన్న వార్త అయినా పెద్ద సెన్సేషన్ అవుతోంది.