సీతారామం చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమైంది బాలీవుడ్ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్.. డైరెక్టర్ హానురాగవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ చిత్రం సౌత్ ఇండస్ట్రీలో ఒక విభిన్నమైన ప్రేమ కథ చిత్రం గా నిలిచిపోయింది. మృణాల్ ఠాకూర్ కి ఈ చిత్రం ద్వారా తెలుగులో వరుస అవకాశాలు వెలుపడ్డాయి. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇప్పటికీ ఏడాది కావస్తున్న సందర్భంగా సోషల్ మీడియాలో తెలుగు ప్రేక్షకులను ఉద్దేశిస్తూ ఒక పోస్టును షేర్ చేయడం జరిగింది ఈ ముద్దుగుమ్మ.
తెలుగు సినీ ప్రియులు చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది మృణాల్ ఠాకూర్.. సౌత్ ఆడియన్స్ ను మరింత అలరిస్తానని తెలియజేసింది.. “డియర్ ఆడియన్స్ నటిగా నా మొదటి సినిమా సీతారామం నేను కన్న కలలను మించి మీరు నా పైన ప్రేమాభిమానాలు చూపించారు.. నన్ను మీ తెలుగింటి అమ్మాయిల ఆదరించారు.. ఈ ప్రయాణంలో అంతులేని ప్రేమ చూపించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం మరిన్ని సంవత్సరాలు విభిన్నమైన పాత్రలతో మీకు మరింత వినోదాన్ని అందిస్తానని ఒక పోస్ట్ షేర్ చేయడం జరిగింది మృణాల్ ఠాకూర్”..
అలాగే చిత్ర యూనిట్ని ఉద్దేశిస్తూ నా నుంచి సీత బెస్ట్ వర్షన్ స్క్రీన్ పైకి తీసుకువచ్చిన డైరెక్టర్ హానురాగవపుడికి ఈ ప్రయాణాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసిన దుల్కర్ కు ప్రత్యేకమైన ధన్యవాదాలు అంటూ పోస్టులు షేర్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నానితో ఒక సినిమా రామ్ చరణ్తో తదుపరి చిత్రంతో పాటు విజయ్ దేవరకొండ తో ఒక సినిమాలో నటిస్తోంది.
View this post on Instagram