దక్షిణాది భారతీయ సినీ చరిత్రలోనే తన పాటలతో సంగీతంతో ఎంతోమంది కుర్రకారులకు ఊపు తేంచిన సంగీత దర్శకులలో దేవిశ్రీప్రసాద్ కూడా ఒకరిని చెప్పవచ్చు. తన మ్యూజిక్ అంటే ప్రతి ఒక్కరు చాలా ఇష్టపడుతూ ఉంటారు. దేవిశ్రీప్రసాద్ కెరియర్ లో ఆనందం, నీకోసం ,బొమ్మరిల్లు, ఖడ్గం ,ఆర్య ,సరినేరు నీకెవ్వరు ,వాల్తేరు వీరయ్య, గబ్బర్ సింగ్ వంటి చిత్రాలకు తను మ్యూజిక్ ని అందించారు. మ్యూజిక్ అందించడమే కాకుండా చాలా సినిమాలకు పాటలు కూడా అద్భుతంగా అందించారు.
దేవి శ్రీ ప్రసాద్ ప్రొఫెషనల్ లైఫ్ బాగున్నప్పటికీ పర్సనల్ లైఫ్ మాత్రం పెద్దగా ఆశించిన స్థాయిలో లేదు ఎందుకంటే ప్రస్తుతం నాలుగుపదుల వయసు దాటినప్పటికీ ఇంకా వివాహం చేసుకోకుండా ఉన్నారు. గతంలో ఒకసారి హీరోయిన్ తో ప్రేమాయణం అంటూ పలు రకాల రూమర్లు కూడా వినిపించాయి. అయితే ఇప్పటికే ఎన్నోసార్లు దేవిశ్రీప్రసాద్ పెళ్లి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా మరొకసారి పెళ్లి అంటూ కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.
పుష్ప సినిమాలోని ఊ అంటావా మావ.. ఉ ఊ అంటావా మావా అనే పాటతో ఓవర్ నైట్ కి మంచి పాపులారిటీ సంపాదించిన మంగ్లీ చెల్లెలు ఇంద్రావతితో దేవిశ్రీప్రసాద్ కొన్ని ఫోటోలు దిగడం జరిగింది. అయితే ఈ ఫోటోలను ఇంద్రావతి తన సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది ఇక ఈ ఫోటోలు షేర్ చేసిన కొన్ని సెకండ్లలోని వైరల్ గా మారడంతో ఇవి చూసిన కొంతమంది నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు ఈ జంట చూడడానికి చాలా బాగుంది.. ఏజ్ కూడా జస్ట్ నెంబరే అంటూ వీరిద్దరూ గురించి పెళ్లి వార్త వైరల్ గా మారుతోంది. ఎప్పటికైనా ఇంద్రావతి ఈ మ్యూజిక్ డైరెక్టర్ తో పెళ్లి పీటలు ఎక్కబోతోంది అనే న్యూస్ వైరల్ గా మారుతోంది.
View this post on Instagram