టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల జాబితాలో మరాఠీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ముందు వరసలో ఉంది. ఈ అమ్మడు తెలుగులో ఇప్పుడు వరకు చేసింది ఒక్కటే సినిమా. అదే `సీతారామం`. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ క్లాసిక్ లవ్ స్టోరీ.. గత ఏడాది ఆగస్టు 5న విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది.
సౌత్ తో పాటు నార్త ప్రేక్షకుల హృదయాలను కూడా దోచేసింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇందులో సీతామహాలక్ష్మి పాత్రలో మృణాల్ చూపించిన అభినయం, ఆమె నటన ఆడియోన్స్ అంత తర్వాత మర్చిపోలేదు. ఇక ఒక్క సినిమాతో మృణాల్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ముద్రవేయించుకుంది. అయితే ఆమెకు స్టార్డమ్ దక్కడానికి కారణం బుట్టబొమ్మ పూజా హెగ్డేనే అట. మరి వీరిద్దరికీ లింకేంటో తెలుసుకుందాం పదండి.
సీతారామం మూవీకి ఫస్ట్ ఛాయిస్ మృణాల్ ఠాకూర్ కాదు. ఇందులో దుల్కర్ కు జోడీగా మొదట డైరెక్టర్ హను పూజా హెగ్డేను సంప్రదించాడట. ఆమె ఒకే కూడా చెప్పింది. షూటింగ్ స్టార్ట్ అయిన కొద్ది రోజులకు కరోనా వచ్చింది. దీంతో పూజా హెగ్డే డేట్స్ సద్దుబాటు చేయలేక సీతారామం నుంచి తప్పుకుంది. అప్పుడు మేకర్స్ హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ ను దింపారు. అలా పూజా హెగ్డే ఖాతాలో పడాల్సిన ఈ బ్లాక్ బస్టర్ మృణాల్ ను వరించింది. ఇప్పుడు ఆమె స్టార్ అయింది. పూజా హెగ్డే కెరీర్ కే ఎసరు పెట్టేలా ఆఫర్లు అందుకుంటోంది. తెలుగులో మృణాల్ ఇప్పుడు న్యాచురల్ స్టార్ నాని `హాయ్ నాన్న`తో పాటు విజయ్ దేవరకొండతో ఓ మూవీకి కమిట్ అయింది.