తెలుగు బుల్లితెర‌పై 1000 కంటే ఎక్కువ సార్లు ప్ర‌సార‌మైన మూవీ ఏదో తెలుసా.. మ‌న మ‌హేష్ బాబుదే!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు అరుదైన ఘ‌త‌ను సొంతం చేసుకున్నారు. తెలుగులో మ‌రే హీరోకు సాధ్యం కాని రికార్డును నెల‌కొల్పారు. మ‌హేష్ బాబు న‌టించిన ఓ సినిమా బుల్లితెర‌పై 1000 కంటే ఎక్కువ సార్లు ప్ర‌సార‌మైంది. ఇప్ప‌టికి వ‌రకు తెలుగులో స్మాల్ స్క్రీన్ పై మ‌రే హీరో సినిమా ఇన్నిసార్లు ఆడింది లేదు. కానీ, మ‌హేష్ బాబు న‌టించిన `అత‌డు` ఆ రికార్డును కొల్ల‌గొట్టింది.

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌, మ‌హేష్ బాబు కాంబోలో వ‌చ్చిన తొలి సినిమా ఇది. ఇందులో త్రిష హీరోయిన్ గా న‌టించింది. డి. కిషోర్, ఎం. రామ్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించగా జయభేరి ఆర్ట్స్ పతాకంపై మురళీ మోహన్ సమర్పకుడిగా వ్యవహరించాడు. మణిశర్మ ఈ మూవీకి స్వ‌రాలు అందించారు. రూ. 7 కోట్ల బ‌డ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం 2005 ఆగ‌స్టు 10న విడుద‌లై మంచి విజ‌యం సాధించింది.

ఈ సినిమా శానిలైట్ హ‌క్కునల‌ను ప్ర‌ముఖ ఛానెల్ స్టార్ మా సొంతం చేసుకుంది. అయితే స్టార్ మాలో ఇప్ప‌టి వర‌కు ఈ సినిమా ఇర‌వై ముప్పై కాదు ఏకంగా 1350 సార్లు టెలికాస్ట్ అయింది. ఎన్ని సార్లు ప్ర‌సారం అయినా కూడా అత‌డు మూవీ ప్రేక్ష‌కుల‌ను టీవీకి అతుక్కుపోయేలా చేస్తూ మంచి టీఆర్పీని అందుకుంటుంద‌ట‌. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు బుల్లితెర‌పై మ‌రే తెలుగు సినిమా 1000కి పైగా టెలికాస్ట్ అయింది లేదు. కాగా, మ‌హేష్-త్రివిక్ర‌మ్ కాంబో మ‌రోసారి రిపీట్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం వీరి క‌ల‌యిక‌లో `గుంటూరు కారం` తెర‌కెక్కుతోంది. వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా ఈ మూవీ విడుదల కానుంది.