సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం `గుంటూరు కారం` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ మాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ స్వరాలు అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.
హైదరాబాద్ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. అయితే తాజాగా గుంటురు కథ స్టోరీ ఇదే అంటూ నెట్టింట ఓ వార్త వైరల్ గా మారింది. దాని ప్రకారం చూస్తే.. మహేష్ బాబు ఇందులో గుంటూరు డాన్గా కనిపిస్తాడట. అక్కడ అతడే కింగ్. లైఫ్ ఫుల్ బిందాస్ గా సాగిపోతున్న తరుణంలో హీరో ఓ జర్నలిస్ట్తో ప్రేమలో పడతాడు. సిటీలో జరిగే అన్యాయాలు అక్రమాలపై పోరాడుతూ.. సదరు జర్నలిస్ట్ చిక్కుల్లో పడుతుంది.
దాంతో హీరో హీరోయిన్ కు అండంగా నిలుస్తాడు. ఆమె లక్ష్యాన్ని తన లక్ష్యంగా భావించి.. విలన్లను ఎలా ఎదురించాడు అన్నదే గుంటూరు కారం కథ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇలాంటి కథతో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. దీంతో ఫ్యాన్స్ ఇటువంటి పనికిమాలిన రొట్ట స్టోరీకి మహేష్ బాబు ఎలా ఒప్పుకున్నాడో ఏమీ అంటూ వాపోతున్నారు. అయితే మరి నిజంగా గుంటూరు కారం స్టోరీ ఇదేనా.. కాదా.. అన్నది తెలియాలంటే మరికొద్ది నెలలు వెయిట్ చేయాల్సిందే.