న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి అతి తక్కువ సమయంలోనే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. నటన పరంగానే కాకుండా అదిరిపోయే డ్యాన్సులతో సపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే సాయి పల్లవికి ఒక చెల్లులు ఉంది. ఆమె పేరు పూజా కన్నన్. అక్క మాదిరే చెల్లెలు కూడా చాలా టాలెంటెడ్.
`చితిరై సెవ్వానం` అనే తమిళ మూవీతో పూజా కన్నన్ 2021లో సినీ రంగ ప్రవేశం చేసింది. తండ్రీకూతురు సెంటిమెంట్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో సముద్రఖని పూజా కన్నన్ కు తండ్రి పాత్రను పోషించారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ, పూజా కన్నన్ నటనకు మాత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. అయితే ఈ చిత్రం తర్వాత పూజా కన్నన నుంచి మరో మూవీ రాలేదు. ఒక్క సినిమాతోనే ఆమె ఇండస్ట్రీలో మాయం అవ్వడానికి బలమైన కారణమే ఉందట.
పూజా కన్నన్ డెబ్యూ మూవీ విడుదల తర్వాత కోలీవుడ్ కు చెందిన ఓ హీరో ఆమెను బాగా వేధించాడట. నిత్యం పూజా కన్నన్ కి అసభ్య మెసేజిలు పెడుతూ.. తప్పుగా వ్యవహరించాడట. ఈ విషయం సాయి పల్లవికి తెలియడంతో.. సదరు హీరో ఉన్న లోకేషన్ తెలుసుకుని అక్కడకు వెళ్లిందట. చుట్టూ అందరూ చూస్తుండగానే సదరు హీరోను సాయి పల్లవి చెప్పుతో కొట్టిందట. ఈ ఘటన జరిగి చాలా రోజులే అవుతున్నా.. ఎక్కడ పరువు పోతుందో అని సదరు హీరో నోరు మెదపలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఆరంభంలోనే ఇలాంటి చేదు సంఘటన ఎదురవడంతో.. పూజా కన్నన్ సినిమాలు వదిలేయాలని ఫిక్స్ అయినట్లు టాక్.