చిరంజీవి- బాలయ్య మధ్య తేడా ఇదే అంటూ రచ్చ చేస్తున్న ఫ్యాన్స్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి ,బాలయ్యకు ప్రేక్షకులలో ఎలాంటి క్రేజీ ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు హీరోలు వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరు హీరోల సినిమాలు ఒకే రేంజ్ లో బిజినెస్ జరుగుతున్నాయని చెప్పవచ్చు.అయితే చిరంజీవి రెమ్యూనరేషన్ బాలయ్య రెమ్యూనరేషన్ మధ్య కూడా చాలా వ్యత్యాసం ఉన్నది. భోళా శంకర్ సినిమా ఈవెన్ సమయంలో చిరంజీవి కీర్తి సురేష్ ను కౌగిలించుకున్న ఫోటోలు వైరల్ గా మారాయి.

Keerthi Suresh Hug By Megastar chiranjeevi pre -Release event of Bhola  Shanker||@TOLLYWOODMEDIA143 - YouTube

నిన్నటి రోజున స్కంద ఈవెంట్లో బాలయ్య ,శ్రీ లీల ను ఆశీర్వదించడం జరిగింది. ఈ ఫోటోలు కూడా వైరల్ గా మారడంతో చిరంజీవి బాలయ్య మధ్య తేడా ఇదేనట్టు పలువురు అభిమానులు నటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు హీరోయిన్లను హీరోలు కౌగిలించుకోవడంలో తప్పు లేకపోయినా కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లి పాత్రలో నటించడంతో ఈ కామెంట్స్ మరింత వైరల్ గా మారుతున్నాయి. అంతేకాకుండా చిరంజీవి చేసిన చేష్టలు కూడా కొంతమందికి నచ్చలేదు..ముఖ్యంగా ఈ విషయం పైన పలు భిన్నభిప్రాయాలుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. స్కంద సినిమాలో రామ్ గురించి బోయపాటి గురించి చెప్పగా బోయపాటి శ్రీను పైన ఉన్న అభిమానంతో బాలయ్య ఈవెంట్ కి హాజరయ్యారని సమాచారం.

ప్రస్తుతం బాలయ్య అనిల్ రావుపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల నటిస్తుండగా హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది..ఈ సినిమా ఈ ఏడాది దసరాకు విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. బిజినెస్ కూడా భారీగానే జరిగినట్టు సమాచారం భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమా అభిమానులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి.