చిరంజీవి పైన విష ప్రయోగం చేసింది ఎవరో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో ఎంత గొప్ప పేరుతో పాటు ఎంతోమందికి సహాయం చేసే గుణంతో పాటు పలుసేవ కార్యక్రమాలను కూడా చేపడుతూ ఎప్పుడు అభిమానులను స్థిరస్థాయిగా ఉండేలా పేరు సంపాదించుకున్నారు చిరంజీవి. అయితే అలాంటి చిరంజీవి పైన కూడా విష ప్రయోగం జరిగిందనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. అయితే ఈ విషయాన్ని ఈ ఏడాది విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమా వేడుక ఫంక్షన్ లో భాగంగా తెలియజేయడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.

చిరంజీవి 1988లో మరణం మృదంగం సినిమా రిలీజ్ అయింది.. చిరంజీవి అప్పటికే ఒక స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్నారు.. సినిమా షూటింగ్ నిమిత్తం చెన్నైలో ఉండడం వల్ల ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అక్కడ పెద్ద ఎత్తున రావడం జరిగిందట. అలా అభిమానులను పలకరిద్దామని బయటికి వెళ్ళగా ఇందులోనే ఒక అభిమాని గుంపులో నుంచి బయటికి వచ్చి మీ సమక్షంలో బర్తడే జరుపుకుంటున్నాం అంటూ తనతో పాటు వచ్చి కేక్ కట్ చేయమని చెప్పారట.

 

చిరంజీవి ఎంత వద్దన్నా కూడా కేక్ చిరంజీవి నోట్లో పెట్టాడట..అయితే అది చిరంజీవి నోటికి రుచి తేడాగా ఉండడంతో దానిని బయటకి ఉమ్మి వేయడం జరిగిందట. ఆ సమయంలో తోపులాట జరగడంతో బల్లపైన ఉన్న కేక్ ఒక్కసారిగా కింద పడిపోయింది. అందులో ఉన్న రంగులు బయటపడ్డాయి. ఈ గ్యాప్ లోనే అక్కడ చిరంజీవి సిబ్బంది చిరంజీవి పెదాలు నీలిరంగులో మారడం గమనించారు..దీంతో చిరంజీవి పైన విష ప్రయోగం జరిగిందనే విషయాన్ని అర్ధం చేసుకొని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ విషయానికి విరుగుడు ఇప్పించారట. ఆ తర్వాత కేక్ తెచ్చిన అభిమానిని అభిమానులు కొట్టగా నిజం చెప్పారట.. చిరంజీవి తనతో మాట్లాడడం లేదని వేరే వాళ్ళతో క్లోజ్ గా ఉండడం సహించలేక కేరళ నుంచి వశీకరణం చేసిన పౌడరుని కలిపానని తెలిపారు.. చిరంజీవికి ఇంత చేసిన అభిమానిని తనని కొట్ట వద్దంటూ క్షమించి వదిలేయమని అభిమానులకు చెప్పారట.