డీజే టిల్లు సీక్వెల్ లో నేహా శెట్టి.. ఈసారి ఏకంగా..?

టాలీవుడ్ లో ఎప్పటినుంచో ఉన్నటువంటి హీరోయిన్ నేహా శెట్టి కేవలం డీజే టిల్లు సినిమా ద్వారా ఓవర్ నైట్ కి మంచి స్టార్డం ను సంపాదించుకుంది. సిద్దు జొన్నలగడ్డతో చేసిన ఈ చిన్న సినిమాతో ఈమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.. డీజే టిల్లు సినిమాలో రాధికా పాత్రలో అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమా మంచి విజయం సాధించడంలో కూడా ఈమె పాత్ర కీలకమని కూడా చెప్పవచ్చు.. అందుకే ఈ సినిమా సీక్వెల్ ని కూడా వెంటనే ప్రకటించారు చిత్ర బృందం. అయితే ఈ సినిమా టైటిల్ను టిల్లు స్క్వేర్ అనే టైటిల్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు.

DJ Tillu 2: After Neha Shetty, Anupama is being replaced as well - JSWTV.TV

ఇందులో హీరోయిన్గా అనుపమ పరమేశ్వర నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, గ్లింప్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 15వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. తాజాగా టిల్లు స్క్వేర్ సినిమా నుంచి ఒక అదిరిపోయే అప్డేట్ వినిపిస్తోంది. అదేమిటంటే ఈ సినిమా క్లైమాక్స్లో హీరోయిన్ రాధిక క్యారెక్టర్ చేసిన నేహా శెట్టి కూడా గెస్ట్ అపీరియన్స్ గా రాబోతోందని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఈ సినిమా పైన మరింత అంచనాలు పెరగడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. యూత్లో సోషల్ మీడియాలో నేహా శెట్టి రాధిక క్యారెక్టర్ కి బాగానే ఫాలోయింగ్ ఉందని ఇది కూడా క్యాష్ చేసుకునే విధంగా నేహా శెట్టి ఒక గెస్ట్ అపీరియన్స్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. మరి ఈ విషయం పైన చిత్రబృందం ఇప్పటివరకు అయితే క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇందులో అనుపమాకు చెల్లి లేదా ఫ్రెండ్ అయినా కావచ్చని సమాచారం.