తల్లి ఏమో హీరోయిన్గా కూతురేమో చెల్లెలుగా.. చిరంజీవితో నటించింది ఎవరో తెలుసా..?

డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భోళా శంకర్. ఇందులో తమన్నా కథానాయకగా నటించగా.. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలి పాత్రలో నటిస్తోంది. హీరో సుశాంత్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా కీర్తి సురేష్ ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను సైతం తెలియజేసింది.

హీరోయిన్ కీర్తి సురేష్ భోళా శంకర్ చిత్రంలో చిరంజీవికి చెల్లెలుగా నటించింది. అయితే కీర్తి సురేష్ తల్లి మేనక కూడా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే.. ఈమె 1980లో వచ్చిన చిరంజీవి పున్నమినాగు చిత్రంలో చిరంజీవి సరసన నటించింది. మేనక కూతురి కీర్తి సురేష్. ఈ విషయంపై కీర్తి సురేష్ మాట్లాడుతూ.. చిరంజీవి గారితో తన తల్లి పున్నమినాగు సినిమాలో నటించింది.. అప్పటి చాలా విషయాలు అమ్మ తనకు చెప్పింది. చిరంజీవి గారి ఎనర్జీ డేడికేషన్ సెట్ లో ఉన్నప్పుడు ఇచ్చే సలహాలు సూచనలు గురించి కూడా తెలియజేసిందని తెలిపింది.

Keerthy Suresh Is Getting Married Soon! Will She Say Good-bye To Her Acting  Career? - Filmibeat

ఎవరినైనా సరే చాలా కేరింగ్ గా చూసుకునే వారిని.. అమ్మ చాలా చిన్న వయసులోనే సినిమాలలోకి వచ్చింది అప్పుడు చిన్న పాపకి చెప్పినట్టుగా అన్ని విషయాలు చిరంజీవి చెప్పేవారట. ఈ విషయాలన్నీ చిరంజీవి గారితో చెప్పగా రియాక్షన్ తనకు చాలా సర్ప్రైజ్ గా చేసిందని తెలిపారు..”మీ అమ్మగారు ఇదే చెప్పిందే నేను తనతో చాలానే చెప్పాను అని అన్నారట చిరంజీవి”. అయితే ఈనెల తర్వాత అలాంటి విషయం గుర్తుపెట్టుకుని చెప్పడం అంటే అది మామూలు విషయం కాదు.. మీ అమ్మ చాలా అమాయకురాలు నువ్వు మాత్రం అలా కాదు స్మార్ట్ నువ్వు అని చిరంజీవి తనని అన్నట్టుగా కీర్తి సురేష్ తెలిపింది.. ఏదిఏమైనా ఒకే కుటుంబంలో ఒకపక్క తల్లేమో హీరోయిన్గా కూతురేమో చిరంజీవి చెల్లెలుగా నటించడం వీరికే దక్కిందని చెప్పవచ్చు.