చిరంజీవి కెరియర్ లోనే ఆగిపోయిన భారీ బడ్జెట్ చిత్రాలెన్నో తెలుసా..?

తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది హీరోలు ఉన్నప్పటికీ మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పటికీ తన సినిమాలను విడుదల చేస్తూ కుర్ర హీరోలకు దీటుగా పోటీపడుతున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటివరకు 155 కు పైగా సినిమాలలో నటించారు చిరంజీవి. చిరంజీవి కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు ఉన్నప్పటికీ కొన్ని క్రేజీ ప్రాజెక్టులు కూడా మధ్యలో ఆగిపోయినట్టుగా తెలుస్తోంది వాటి గురించి తెలుసుకుందాం.

చిరంజీవి హీరోగా సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన భూలోక దొంగ సినిమా అని మొదలు పెట్టారట. అయితే ఈ కథలో కొన్ని మార్పులు చేర్పులు చేయడం వల్ల ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయినట్టు సమాచారం.

ఇక ఆ తర్వాత చిరంజీవి పాన్ ఇండియా లెవెల్లో ఆబు బాగ్దాగ్ గజదొంగ అనే సినిమా అని అనౌన్స్మెంట్ చేశారు. అయితే ఈ చిత్రాన్ని ఇండియాలో ఉండే అన్ని భాషలలో విడుదల చేయాలనుకున్నారు డైరెక్టర్ సురేష్ కృష్ణ.. అయితే బడ్జెట్ ఎక్కువ అవ్వడం చేత ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయిందట.

ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్మెంట్ చేయగా అది కూడా ఆగిపోయింది. ఆ తర్వాత చిరంజీవి హీరోగా రామ్ రెడ్డి దర్శకత్వంలో వజ్రాల దొంగ సినిమా అని అనౌన్స్మెంట్ చేశారు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో పూజా కార్యక్రమం కూడా జరగగా కొన్ని కారణాల చేత ఆగిపోవడం జరిగింది.

 

చిరంజీవి 150వ సినిమాను డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈ సినిమాని అనుకోగా ఎందుకో వర్కౌట్ కాలేదు. ఆర్జీవి దర్శకత్వంలో వినాలని ఉంది సినిమాని టైటిల్ అనౌన్స్ చేసి కొన్ని కారణాల చేత మధ్యలోనే నిలిపివేయడం జరిగింది.