రాజ‌మౌళి ప‌రువు మొత్తం తీసేసిన నిర్మాత‌.. ఫ్లాపులు రాక‌పోవ‌డానికి కార‌ణం అదే అంటూ షాకింగ్ కామెంట్స్‌!

ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ప్ర‌తిభ గురించి ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. దాదాపు రెండు ద‌శాబ్దాల కెరీర్ లో అప‌జ‌యం అన్న‌ది ఆయ‌న హిస్ట‌రీలోనే లేదు. ఆయ‌న ప్ర‌తి సినిమా ఒక దాన్ని మించి మ‌రొక‌టి విజ‌యాన్ని అందుకున్నాయి. జ‌క్క‌న్న ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలు తెలుగు జాతి ఖ్యాతిని ప్ర‌పంచ‌స్థాయికి చాటి చెప్పాయి. ఇక భార‌త్ కు ఎన్నో ఏళ్ల నుంచి క‌ల‌గా మిలిగిపోయిన ఆస్క‌ర్ ను సైతం ప‌ట్టుకొచ్చిన అసాధ్యుడు మ‌న ద‌ర్శ‌క‌ధీరుడు.

అటువంటి రాజ‌మౌళిపై ప్ర‌ముఖ సీనియ‌ర్ నిర్మాత సి.క‌ళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజ‌మౌళి ప‌రువు మొత్తం తీసేశాడు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో సి. క‌ళ్యాణ్ మాట్లాడుతూ.. `ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో కేవ‌లం ఐదు నుంచి ఎనిమిది శాతంమే స‌క్సెస్ ఉంటుంది. ప్రేక్ష‌కుల ప‌ల్స్ ప‌ట్టుకోవ‌డం ద‌ర్శ‌కుల‌కు అంత సుల‌భం కాదు. రాజ‌మౌళికి కూడా అది అసాధ్యం. అయినా ఐదేళ్ల‌కు ఒక సినిమా తీస్తే ఫ్లాప్ ఎలా వ‌స్తుంది. ఏడాదికి నాలుగు, ఐదు సినిమాలు తీస్తే రాజ‌మౌళికి కూడా హిట్‌, ఫ్లాప్ అంటే ఏమిటో తెలుస్తుంది` అంటూ వ్యాఖ్యానించారు.

స్టార్స్‌తో సినిమాలు చేసుకుంటూ పోతే ఫ్లాప్‌లు తెలియ‌వ‌ని.. కొత్త‌వాళ్ల‌తో సినిమా తీసి జ‌నాల‌కు థియేట‌ర్ల‌కు ర‌ప్పించిన‌ప్పుడే ద‌ర్శ‌కుల అస‌లైన ప్ర‌తిభ బ‌య‌ట‌ప‌డుతుంద‌ని సి. క‌ళ్యాణ్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టాడు. స్టార్స్ తో ఏళ్ల త‌ర‌బ‌డి సినిమా చెయ్య‌డమే రాజ‌మౌళికి ఫ్లాపులు రాక‌పోవ‌డానికి కార‌ణమ‌ని ప‌రోక్షంగా సి.క‌ళ్యాణ్ పేర్కొన్నాడు. దీంతో ఈయ‌న కామెంట్స్ కాస్త నెట్టింట దుమారం రేపుతున్నాయి.