టాలీవుడ్ స్టార్స్ ను ఘోరంగా అవ‌మానించిన నాని.. ఏంట‌య్య నీకింత నోటు దురుసు?

టాలీవుడ్ న్యాచుర‌ల్ స్టార్ నాని ఇటీవ‌ల త‌ర‌చూ వివాదాస్ప‌ద కామెంట్స్ తో హెడ్ లైన్స్ లో నిలుస్తున్నాడు. తాజాగా మ‌రోసారి నాని అలాంటి కామెంట్సే చేశాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మ‌ల‌యాళ స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్ కు ఇండియా వైడ్ గా క్రేజ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మ‌ల‌యాళంలోనే కాకుండా అన్ని భాష‌ల్లోనూ సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌కు చేర‌వ‌వుతున్నాడు. తెలుగులో మ‌హాన‌టి, సీతారామం చిత్రాల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ అందుకున్నాడు.

ఇప్పుడు దుల్క‌ర్ స‌ల్మాన్ నుంచి `కింగ్ ఆఫ్ కోథా` అనే పాన్ ఇండియా చిత్రం రాబోతోంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి అభిలాష్ జోషి ద‌ర్శ‌కుడు. ఓనం పండుగ సందర్భంగా ఆగస్టు 24న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. పాన్ ఇండియా మూవీ కావ‌డం వ‌ల్ల అన్ని భాష‌ల్లోనూ ఈ చిత్రాన్ని ప్ర‌మోట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే హైద‌రాబాద్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వ‌హించ‌గా.. రానా ద‌గ్గుబాటి, నాని స్పెష‌ల్ గెస్ట్ లుగా హాజ‌రు అయ్యారు. అయితే ఈ ఈవెంట్ లో నాని చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.

`మనం ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు..పాన్ ఇండియా స్టార్స్ అంటున్నాం కానీ నాకు ఆ పదం నచ్చదు. నాకు తెలిసి అస‌లైన పాన్ ఇండియా స్టార్ అంటే దుల్కర్ సల్మానే. ఎందుకంటే ఓ తమిళ్ దర్శకుడు దుల్కర్ కోసం కథ రాస్తాడు, ఓ తెలుగు దర్శకుడు కథ రాస్తాడు, హిందీ , మలయాళం ఇలా అన్ని బాషల దర్శకులు దుల్కర్ కోసం కథ రాసుకుంటారు. పాన్ ఇండియా యాక్ట‌ర్ కు నిజ‌మైన నిర్వ‌చ‌నం ఇదే` అంటూ నాని పేర్కొన్నాడు. అయితే నానీ కామెంట్స్ పై కొంద‌రు తెలుగు నెటిజ‌న్లు వ్య‌తిరేఖత వ్య‌క్తం చేస్తున్నారు. అంటే టాలీవుడ్ లో పాన్ ఇండియా స్టార్స్ గా వెలుగొందుతున్న ప్ర‌భాస్‌, అల్లు అర్జున్‌, రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ వంటి వారు వేస్టేనా అని కొంద‌రు ప్ర‌శ్నిస్తుంటే.. నాని టాలీవుడ్ స్టార్స్ ను ఘోరంగా అవ‌మానించాడంటూ మ‌రికొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇంకొంద‌రు ఏంట‌య్య నాని నీకింత నోటు దురుసు అంటూ కామెంట్లు చేస్తున్నారు.