మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి త్వరలోనే మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్న ఈ జంట.. ఫైనల్ గా ఏడడుగులు వేసేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవలె వీరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అయితే పెళ్లి నవంబర్ లో జరగబోతోందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ఇటలీలో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారట. డెస్టినేషన్ వెడ్డింగ్ కాబట్టి.. ఇరుకుటుంబసభ్యులు, చాలా దగ్గరి బంధువులు మాత్రమేలో వీరి పెళ్లిలో సందడి చేయనున్నారు. అయితే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి గెస్ట్స్ లిస్ట్ లో టాలీవుడ్ కి చెందిన ఓ హీరో పేరు కూడా ఉందట. ఆ హీరో మరెవరో కాదు నితిన్.
వరుణ్ తేజ్, నితిన్ మధ్య చాలా మంది సన్నిహిత్యం ఉంది. ఈ నేపథ్యంలోనే నితిన్ మరియు ఆయన సతీమణి షాలిని దంపతులను ముఖ్య అతిథుల లిస్ట్ లో చేర్చారట. వరుణ్-లావణ్య పెళ్లికి టాలీవుడ్ నుంచి వెళ్లబోతున్న ఏకైక హీరో నితినే అని అంటున్నారు. ఇక వివాహం అనంతరం హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ జరగనుందట. ఈ రిసెప్షన్ కు టాలీవుడ్ ప్రముఖులందరికీ ఆహ్వానం వెళ్లనుందని తెలుస్తోంది.