గత ఏడాది కార్తికేయ 2 మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్న అందాల భామ అనుపమ పరమేశ్వరన్.. ప్రస్తుతం చేతి నిండా సినిమలతో బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తోంది. తెలుగుతో పాటు మలయాళ, తమిళ సినిమాల్లో కూడా నటిస్తోంది.
టాలీవుడ్ లో సిద్దు జొన్నలగడ్డతో ‘టిల్లు స్క్వేర్’ , మాస్ మహారాజా రవితేజకు జోడీగా `ఈగల్` చిత్రాల్లో నటిస్తోంది. ఈ సంగతి పక్కన పెడితే.. ఈ మలయాళ కుట్టి ఓ స్టార్ హీరో మూవీని అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసిందన్న సంగతి మీకు తెలుసా..? అవును, `మనియారయిలే అశోక్` అనే మాలయాళ చిత్రానికి అనుపమ అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసింది. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ఈ సినిమాను నిర్మించారు.
అలాగే జాకబ్ గ్రెగరీ, అనుపమ పరమేశ్వరన్ ఇందులో ప్రధాన పాత్రలను పోషిస్తే.. దుల్కర్ సల్మాన్, నజ్రియా నజీమ్ అతిధి పాత్రల్లో మెరిశారు. 2019లో ఈ చిత్రం విడుదలైంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుపమ.. `మనియారయిలే అశోకన్` సినిమాకు తాను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశానని ఎవరికీ తెలియని ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టింది. అంతేకాదు, సొంతంగా ఒక్క సినిమాను అయినా డైరెక్ట్ చేయాలనేది తన డ్రీమ్ అని అనుపమ వెల్లడిందింది. కానీ, అనుపమ డైరెక్షన్ లో తెరకెక్కబోయే సినిమాలో ఆమె మాత్రం నటించదట.