రిచ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న నయనతార

నయనతార గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోస్ తో సినిమాలు చేసింది. వరుస హిట్ లతో తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. హీరోయిన్ గా మాత్రమే కాదు కథ నచ్చితే లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పటికే మంచి కథ వస్తే లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించేందుకు రెడీ అవుతుంది. ఇప్పటికే ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందనే టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.


వరుస సినిమాలతో నయనతార బిజీగా ఉంది. అంతే కాదు నయనతార చేస్తున్న సినిమాలకి భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఇప్పటివరకు నయనతార తమిళం, మలయాళం, తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో 75 కు పైగా సినిమాల్లో నటించింది. నయనతార ప్రేమ వ్యవహారాలు కూడా ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. గతంలో శింబుతో నయనతార ప్రేమలో ఉండనే విషయం అప్పట్లో ఒక హాట్ టాపిక్. అయితే తాజాగా అన్ని విషయాలకు చెక్ పెడుతూ నయనతార ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు భర్త, పిల్లలతో కలిసి రిచ్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది నయనతార.

అయితే ఇప్పుడు నయనతార గురించి కొన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి. ఆమె కూడబెట్టిన ఆస్తి విలువ సుమారు రూ.200 కోట్లు ఉంటుందనే వార్త వైరల్ అవుతుంది. అంతే కాదు హైదరాబాద్ లో రెండు ఖరీదైన బంగ్లాలు, చెన్నైలో ఒక ఇల్లు ఉన్నాయి. అంతేకాదు తల్లితండ్రుల కోసం కేరళలో ఒక ఇల్లు ఉంది. హైదరాబాద్ లో ఒక్కో ఫ్లాట్ విలువ 20 కోట్లు ఉంటుందని సమాచారం. తాజాగా నయనతార ఒక జెట్ విమానాన్ని కూడా కొనింది. సినిమాల్లోనే కాదు యాడ్ లలో కూడా నయనతార నటిస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తుంది. అంతే కాదు చెన్నైలో మూతపడిన 53ఏళ్లనాటి థియేటర్‌ను కూడా ఆమె కొనిందని సమాచారం. ఆ స్థలంలో ఒక మల్టీఫ్లెక్స్‌ నిర్మించే ప్లాన్‌లో ఆమె ఉన్నారట. మొత్తానికి నయనతార రిచ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుందనే చెప్పాలి. నయనతార ఇప్పుడు వరుస సినిమాలు చేస్తుంది. బాలీవుడ్ లో భారీ అంచనాలతో వస్తున్న జవాన్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తుంది.