దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. నిన్నటి రోజున ఆయన జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ఎంతోమంది ప్రముఖులు రాజకీయవేత్తలు అభిమానుల సైతం పలు రకాల ట్విట్లు పోస్ట్ షేర్ చేస్తూ ఉన్నారు. అయితే హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా తాజాగా ఒక ట్విట్ షేర్ చేయడం జరిగింది. అయితే ఆ ట్వీట్ లో వైయస్ రాజశేఖర్ రెడ్డి తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేయడం జరిగింది.
పూనమ్ కౌర్ ఇలాంటివి చేస్తూ అనుకోకుండా తన చిన్నప్పుడే వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కలవడం చాలా అదృష్టమని తెలియజేసింది. కానీ ఆమె చేసిన ట్విట్టులో కొన్ని అక్షరాలు తప్పు ఉండడంతో క్షమించమంటూ కూడా ఈ ట్వీట్ కింద పూనమ్ కౌర్ తెలియజేసింది. అయితే పూనమ్ కౌర్ పైన నెట్టిజెన్లు మాత్రం ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు.. పేదవాళ్ళని అడ్డుపెట్టుకుంటూ కేవలం ఓటు కోసమో నోటు కోసమో రాజకీయాలు కొంతమంది చేస్తూ ఉంటే.. కానీ ఎంతోమంది మనసులో చోటు సంపాదించుకున్న అగ్ర నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారిని అనుకోకుండా చిన్నప్పుడు ఈ పులి లాంటి మనిషిని కలవడం అదృష్టంగా భావిస్తున్నాను అంటూ తెలియజేసింది.
దీన్ని బట్టి చూస్తే పూనామ్ కౌర్ చేసిన ట్విట్ పై కొంతమంది టిడిపి కార్యకర్తలు పవన్ అభిమానులు ఇమెను విమర్శిస్తున్నారు. దీంతో ఏమైనా కొంతమంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. కానీ వైయస్సార్ కార్యకర్తలు సీఎం జగన్ అభిమానులు మాత్రం పూనమ్ కౌర్ కు అండగా నిలుస్తున్నారు. దీంతో ఆమెకు జరిగిన కొన్ని విషయాలను కూడా బయటికి రావాలని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఆ పెద్దాయన బతికి ఉంటే పూనమ్ కౌర్ కు కచ్చితంగా న్యాయం జరిగేదని మరి కొంతమంది అభిప్రాయంగా తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా పూనామ్ కౌర్ సంచలనాలకు తెరలేపే విధంగా కనిపిస్తోంది.
పేదవాళ్ల ని అడ్డు పెట్టుకుంటూ కేవలం వోట్ ఇంకా నోటు రాజకీయాలు చేస్తూ ఉంటెయ్ , పేదవాళ్ల మనసు లో చోటు తెచ్చుకున్న అగ్ర నాయుడు రాజశేఖర్ రెడ్డి గారు , అనుకోకుండా చినప్పుడు ఈ పులి లాంటి మనిషి ని కలవడం అదృష్టం గ భావిస్తున్నాను 🙏🇮🇳#memories pic.twitter.com/iT4ey7nlx0
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) July 8, 2023