ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి చిత్రం `జులాయి`. ఇందులో గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా నటిస్తే.. సోను సూద్, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలను పోషించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందించాడు.
2012 ఆగస్టు 9న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈజీ మనీ కోసం ప్రయత్నిస్తే ఎన్ని సమస్యలు వస్తాయి అన్నదే ఈ సినిమా మెయిన్ స్టోరీ. అల్లు అర్జున్ డాన్సులు, త్రివిక్రమ్ మాటలు ఈ మూవీకి హైలెట్ గా నిలిచాయి. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.
అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. జులాయి మూవీకి ఫస్ట్ ఛాయిస్ అల్లు అర్జున్ కాదు. నిజానికి త్రివిక్రమ్ ఈ మూవీ స్టోరీని మహేష్ బాబు కోసం రెడీ చేసుకున్నాడట. మహేష్ బాబుకు కథ కూడా వినిపించాడట. అయితే అప్పటికే త్రివిక్రమ్, మహేష్ కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఈ నేపథ్యంలోనే జులాయి కథ నచ్చినాసరే మహేష్ బాబు సున్నితంగా త్రివిక్రమ్ కు నో చెప్పాడట. అలా చీప్ రీజన్ తో జులాయి వంటి సూపర్ హిట్ మూవీని మహేష్ బాబు మిస్ చేసుకున్నాడు. అదే అల్లు అర్జున్ కు ప్లస్ అయింది.