మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం రెండు సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. వచ్చే నెలలో ఒక్క రోజు వ్యవధిలో తమన్నా నటించిన రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి. అందులో జైలర్ ఒకటి కాగా.. మరొకటి భోళా శంకర్. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన జైలర్ సినిమా ఆగస్టు 10న విడుదల కాబోతోంది. అలాగే చిరంజీవి, తమన్నా కాంబోలో రూపుదిద్దుకున్న `భోళా శంకర్` ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ నేపథ్యంలోనే తమన్నా బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ.. రెండు సినిమాలను తనవంతు ప్రమోట్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. తమన్నాపై కోలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరో తెగ మోజు పడుతున్నాడట. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు అజిత్ కుమార్. తునివు హిట్ అనంతరం అజిత్ నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తన 62వ చిత్రాన్ని ప్రకటించాడు. అయితే అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ నుంచి విఘ్నేష్ తప్పుకోగా.. మగిళ్ తిరుమేని దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై హైయస్ట్ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు `విడాముయర్చి` అనే టైటిల్ ను కన్ఫార్మ్ చేశారు.
ఇందులో అజిత్ కు జోడీగా త్రిషను హీరోయిన్ గా ఎంపిక చేశారు. సంప్రదింపులు కూడా పూర్తి అయ్యాయి. కానీ, ఇప్పుడు అజిత్ చూపంతా తమన్నాపైనే పడింది. జైలర్ సినిమాలోని `కావాలయ్యా` సాంగ్ తో యమా క్రేజ్ తెచ్చుకుంది. ఎక్కడ చూసినా తమన్నా సాంగే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అజిత్ త్రిషను తప్పించి తమన్నాను హీరోయిన్ గా తీసుకోవాలని చెప్పారట. దీంతో మేకర్స్ అదే పనిలో పడ్డారని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. మరో వాదన కూడా ఉంది.. విడాముయర్చి షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ కావాల్సి ఉన్నా అనేక సార్లు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. దీని వల్ల త్రిష డేట్స్ సర్దుబాటు చేయడం కష్టంగా మారిందట. అందుకే ఆమె ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో.. తమన్నాను హీరోయిన్ గా ఎంపిక చేశారన్న టాక్ కూడా ఉంది. మరి ఏది నిజమో చిత్రయూనిట్ తెలియాలి.