క్రేజీ ఆఫ‌ర్ కొట్టేసిన త‌మ‌న్నా.. మ‌రోసారి ఆ స్టార్ హీరోతో జ‌త‌క‌ట్ట‌బోతున్న మిల్కీ బ్యూటీ!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా కెరీర్ ఆరంభం నుంచి హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే వ‌స్తోంది. ప్ర‌స్తుతం తెలుగులో ఈ బ్యూటీ చిరంజీవికి జోడీగా `భోళా శంక‌ర్‌`లో న‌టించింది. అలాగే త‌మిళంలో ర‌జ‌నీకాంత్ తో `జైల‌ర్‌` మూవీ చేసింది. ఈ రెండు సినిమాలు ఒక్క రోజు వ్య‌వ‌ధిలోనే వ‌చ్చే నెల‌లో విడుద‌ల కాబోతున్నాయి.

అయితే ఈ సినిమాలు విడుద‌ల కాకుండానే త‌మ‌న్నా మ‌రో క్రేజీ ఆఫ‌ర్ కొట్టేసింది. కోలీవుడ్ స్టార్ హీరో అజిల్ కుమార్ తో మ‌రోసారి మిల్కీ బ్యూటీ జ‌త‌క‌ట్ట‌బోతోంది. గ‌తంలో వీరి క‌ల‌యిక‌లో వ‌చ్చిన `వీరం` ఘ‌న విజ‌యం సాధించింది. ఇప్పుడు మ‌ళ్లీ వీరి కాంబో రిపీట్ కాబోతోంది. తునివు హిట్ అనంత‌రం అజిత్‌ లైకా ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ లో ఓ సినిమా చేసేందుకు సైన్ చేశాడు. ఈ మూవీకి మొద‌ట న‌య‌న‌తార భ‌ర్త విఘ్నేష్ శివ‌న్ ను ద‌ర్శ‌కుడిగా ఎంపిక చేశారు. కానీ, అనుకోని కార‌ణాల వ‌ల్ల ఆయ‌న ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకున్నారు.

ప్ర‌స్తుతం ఈ సినిమాకు మగిళ్‌ తిరుమేణి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కు ‘విడా ముయర్చి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ను జూన్‌ నెలలో ప్రారంభం కావాల్సి ఉన్నా ప‌ట్టాలెక్క‌లేదు. వ‌చ్చే నెల‌లో షూటింగ్ స్టార్ట్ అవుతుంద‌ని అంటున్నారు. అయితే ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా అనుకున్నారు. కానీ, షూటింగ్ ప‌లు మార్లు వాయిదా ప‌డ‌టం వ‌ల్ల త్రిష డేట్స్ ఖాళీగా లేవ‌ని త‌ప్పుకుంద‌ట‌. దాంతో త‌మ‌న్నాను హీరోయిన్ గా తీసుకున్నార‌ని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.