పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన మెగా మల్టీస్టారర్ `బ్రో`. తమిళంలో ఘన విజయం సాధించిన `వినోదయ సిత్తం`కు రీమేక్ ఇది. దర్శకనటుడు సముద్రఖని ఈ మూవీని తెరకెక్కించాడు. కేతిక శర్మ ఇందులో హీరోయిన్ గా నటించింది. రోహిణి, ప్రియా ప్రకాష్ వారియర్, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలను పోషించారు.
భారీ అంచనాల నడుమ జూలై 28న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ లభించింది. అయితే పవన్ కళ్యాణ్ క్రేజ్ దృష్ట్యా తొలి రోజు ఈ చిత్రం అదిరిపోయే ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా రూ. 30 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం రేపింది. ఇకపోతే బ్రో మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం తెరపైకి వచ్చింది.
అదేంటంటే.. బ్రో సినిమాకు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ ఛాయిస్ కాదట. తమిళంలో వినోదయ సిత్తం మంచి విజయం సాధించిన తర్వాత సముద్రఖని.. ఈ సినిమాను తెలుగులో ముందుగా ప్రభాస్, అఖిల్ తో చెయ్యాలని అనుకున్నాడట. కానీ ప్రభాస్ ఫుల్ బిజీగా ఉండటం వల్ల సముద్రఖని ఆయన్ను కలవలేకపోయాడట. ఆ తర్వాత సూర్య, కార్తీలను పరిశీలించగా.. ఆ ఇద్దరు హీరోలు ఆసక్తి చూడలేదట. ఫైనల్ గా త్రివిక్రమ్ రంగంలోకి దిగి పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ పేర్లను సముద్రఖనికి సూచించాడట. అలా బ్రో మూవీ పట్టాలెక్కిందని అంటున్నారు.