టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ఎవరు అంటే యంగ్ బ్యూటీ శ్రీలీల పేరే వినిపిస్తోంది. వచ్చిన రెండేళ్లలోనే ఈ ముద్దుగుమ్మ తన కనుసైగలతో టాలీవుడ్ లో శాసిస్తోంది. ఇటు యంగ్ హీరోలే కాదు అటు టాలీవుడ్ టాప్ హీరోలు కూడా శ్రీలీల వెంటే పడుతున్నారు. ప్రస్తుతం శ్రీలీల చేతిలో దాదాపు పది ప్రాజెక్ట్ లు ఉన్నాయి అంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే ఇటీవల శ్రీలీల ఓ పాన్ ఇండియా మూవీ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. ఇంతకీ ఆ మూవీ మరేదో కాదు `పుష్ప 2`. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. పుష్ప పార్ట్ 1 సంచలన విజయాన్ని నమోదు చేయడంతో.. రెండు భాగాన్ని అంతకు మించి అనేలా రూపొందిస్తున్నారు. ఇకపోతే పుష్ప ది రైజ్ లో సమంత స్పెషల్ సాంగ్ లో మెరిసింది. `ఊ అంటావా మావ` అంటూ ఓ ఊపు ఊపేసింది.
అయితే పుష్ప 2లో ఐటెం సాంగ్ కోసం శ్రీలీల ని సుకుమార్ సంప్రదించారంట. కానీ, శ్రీలీల ఎలాంటి మొహమాటం చూపించకుండా వెంటనే నో చెప్పిందట. దాంతో సుకుమార్ అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తామని శ్రీలీలను ఒప్పించే ప్రయత్నం చేశాడట. దాంతో చిర్రెత్తిపోయిన శ్రీలీల ఎంత డబ్బు ఇచ్చినా తాను ఐటెం సాంగ్స్ చెయ్యను.. బలవంతం చెయ్యెద్దంటూ కూల్ గానే స్ట్రోంగ్ వార్నింగ్ ఇచ్చిందట. దాంతో సుకుమార్ పుష్ప 2 స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీని దింపే పనిలో పడ్డనిట్లు టాక్. ఏదేమైనా శ్రీలీల డబ్బు కోసం ఆశపడకుండా `పుష్ప 2` ఐటెం సాంగ్ ఆఫర్ ను రిజెక్ట్ చేయమే మంచి పనైందని అంటున్నారు.