లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త, కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేష్ శివన్ కు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ స్ట్రోంగ్ వార్నింగ్ ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నయనతార త్వరలోనే బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. షారుఖ్ ఖాన్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్ర పోషించాడు.
రెడ్ చిల్లీ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్పై షారుఖ్ భార్య గౌరీ ఖాన్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 7న పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కానుంది. అనురుధ్ రవిచంద్రన్ ఈ మూవీకి స్వరాలు అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై ఓ రేంజ్లో హైప్ క్రియేట్ చేశాయి. రీసెంట్ గా బయటకు వచ్చిన ట్రైలర్ ఆ అంచాలను మరో లెవల్ కి తీసుకెళ్లాయి. అయితే జవాన్ ట్రైలర్ ను చూసిన విఘ్నేష్.. సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించాడు.
ఔట్పుట్ ఇంటర్నేషన్ లెవల్ ఉంది.. హ్యాట్సాఫ్ అంటూ ట్రైలర్ ఉద్దేశిస్తూ పోస్ట్ పెట్టాడు. అలాగే చిత్రటీమ్ మొత్తానికి బెస్ట్ విషెస్ తెలిపాడు. దీంతో విఘ్నేష్ ప్రశంసలకు షారుఖ్ ఖాన్ రిప్లై ఇచ్చాడు. `మీ ప్రేమకు ధన్యవాదాలు. నయనతార జవాన్ లో అద్భుతంగా నటించింది. అయితే ఆమెతో ఒకపై చాలా జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే, ఆమె కొన్ని భారీ కిక్స్, పంచులు నేర్చుకుంది` అంటూ ఫన్నీగా విఘ్నేష్ కు వార్నింగ్ ఇచ్చాడు.. దీంతో షారుఖ్ ట్వీట్ కాస్త వైరల్ గా మారింది.