ఆమెను మ‌ర్చిపోలేక‌పోతున్న క‌ళ్యాణ్ దేవ్‌.. `మిస్ యూ బేబీ` అంటూ షాకింగ్ పోస్ట్‌!

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీ‌జ రెండో పెళ్లి కూడా పెటాకులు అయిన సంగ‌తి తెలిసిందే. శిరీష్ భరద్వాజ్ తో తెగ‌దెంపులు చేసుకున్న త‌ర్వాత శ్రీ‌జ‌.. త‌న తండ్రి సూచ‌న మేర‌కు కళ్యాణ్ దేవ్ ను పెళ్లి చేసుకుంది. ఈ దంప‌తుల‌కు న‌విష్క అనే కూతురు జ‌న్మించింది. శ్రీ‌జ‌తో పెళ్లి అయిన త‌ర్వాత క‌ళ్యాణ్ దేవ్ హీరోగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టాడు.

చిరంజీవి అల్లుడు అనే ఇమేజ్ తో అడ‌పా త‌డ‌పా అవ‌కాశాలు అందుకున్నాడు. కానీ, ఇంత‌లోనే క‌ళ్యాణ్ దేవ్‌, శ్రీ‌జ కాపురంలో చిచ్చు రేగింది. అది చివ‌ర‌కు విడాకుల వ‌ర‌కు దారి తీసింది. అధికారిక ప్ర‌క‌ట‌న లేక‌పోయినా.. వీరి విడాకులు దాదాపు క‌న్ఫార్మ్ అయ్యాయి. అలాగే కూతురు న‌విష్క శ్రీ‌జ ద‌గ్గ‌రే ఉంటోంది. వారంలో ఒక రోజు.. అది కూడా నాలుగు గంట‌లు మాత్ర‌మే న‌విష్క‌ను క‌లిసే అవ‌కాశాన్ని క‌ళ్యాణ్ దేవ్ కు కోర్టు క‌ల్పించింది.

అయితే కూతురును క‌ళ్యాణ్ దేవ్ బాగా మిస్ అవుతున్నాడు. ప్ర‌తివారం న‌విష్క‌ను క‌లుస్తున్నాస‌రే.. ఆమెను మ‌ర్చిపోలేక‌పోతున్నాడు. క‌ళ్యాణ్ దేవ్ పెట్టిన లేటెస్ట్ పోస్ట్ తో ఈ విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంది. క‌ళ్యాణ్ దేవ్ త‌ల్లి బ‌ర్త్‌డే కావ‌డంతో.. ఇంట్లో వారు ఆమె చేత కేక్ క‌ట్ చేయించారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంటూ త‌ల్లికి బ‌ర్త్ డే విషెస్ తెలిపాడు క‌ళ్యాణ్ దేవ్‌. అలాగే కూతురు న‌విష్క‌ను గుర్తు చేసుకుంటూ `మిస్ యూ మై బేబీ` అని క్యాప్ష‌న్ కూడా రాసుకొచ్చాడు. దీంతో క‌ళ్యాణ్ దేవ్ పోస్ట్ కాస్త వైర‌ల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev)