విడాకులు తీసుకున్న ఇన్నేళ్లకు ..చైతన్య పై లీగల్ యాక్షన్ తీసుకోబోతున్న సమంత తల్లి..ఎందుకంటే..?

దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగాయి.. అన్న సామెత మనలో చాలామంది వినే ఉంటాం. ఇప్పటికి మన ఇంట్లోని పెద్దవాళ్లు తరచూ ఈ డైలాగులు చెబుతూనే ఉంటారు. అయితే ఇదే విషయం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే విడాకులు తీసుకొని దాదాపు ఒకటిన్నర సంవత్సరం దాటిపోయిన తర్వాత సమంత తల్లి నాగచైతన్య పై లీగల్ యాక్షన్ తీసుకోవడానికి రెడీ అయింది అన్న వార్తలు వినిపిస్తూ ఉండడమే . ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న చైతన్య స్టార్ హీరోయిన్ సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . అబ్బో వీళ్ళ పెళ్లి టైం లో నడిచిన హంగామా అంతా ఇంతా కాదు ఒకటా.. రెండా.. కొన్ని కోట్లు ఖర్చు చేసి మరి వీళ్ళ పెళ్లిని ఘనంగా జరిపించారు నాగార్జున. అయితే పెళ్లి జరిగిన నాలుగేళ్లకే వీళ్ళు విడాకులు తీసుకొని దూరం గా ఉంటున్నారు. అయితే వీళ్ల విదాకులకి కారణం సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలే అంటూ చెప్పుకు వచ్చిన నాగచైతన్య పై సమంత తల్లి లీగల్ యాక్షన్ తీసుకునేందుకు రెడీ అయిందట.

ఎందుకంటే సమంత ఆరోగ్యం పాడైపోవడానికి కారణం నాగచైతన్యానే అనేది సమంత తల్లి వాదన . అంతేకాదు వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడే సమంతకి ఈ మయోసైటిస్ అనే వ్యాధి వచ్చిందని అప్పటి నుంచి సమంతకి ఈ వ్యాధి నయం అవ్వడానికి చూయించకుండా చైతన్య నిర్లక్ష్యం చేయడం వల్లే సమంత కండిషన్ ఇప్పుడు ఇంతలా మారిపోయిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . అందుకే సమంత తల్లి నాగచైతన్య పై లీగల్ యాక్షన్ తీసుకోవడానికి అన్ని విధాల ప్రయత్నిస్తుందట . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!