బైక్ యాక్సిడెంట్ తర్వాత `విరూపాక్ష` వంటి బ్లాక్ బస్టర్ మూవీతో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చిన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. మరికొద్ది రోజుల్లో `బ్రో` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఇందులో సాయి ధరమ్ తేజ్ తో పాటు పవన్ కళ్యాణ్ కూడా నటించాడు. ఈ మెగా మల్టీస్టారర్ కు సముద్రఖని దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించాడు.
ఇందులో తేజ్ కు జోడీగా కేతిక శర్మ నటించింది. జూలై 28న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు కూడా షురూ అయ్యాయి. ఇదిలా ఉంటే.. బ్రో మూవీ ఒక రకంగా సాయి ధరమ్ తేజ్ కొండ ముంచింది. ఈ మూవీ వల్ల తేజ్ కు పెళ్లి చేసుకోవాలన్న మూడు, ఉత్సాహం రెండు పోయాయట. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్స్ లిస్ట్ లో తేజ్ ఒకడు. దీంతో తేజ్ ఎక్కడికి వెళ్లినా.. `పెళ్లెప్పుడు?` అన్న ప్రశ్న ఆయనకు ఎదురవుతూనే ఉంటుంది.
తాజాగా తిరుపతి ప్రచార కార్యక్రమంలో ఉన్న తేజ్.. ఫ్యాన్స్ తో సరదాగా ముచ్చటించాడు. మా గురువు గారు పవన్ కళ్యాణ్ అవకాశం ఇవ్వడం వల్లే ఆయనతో స్క్రీన్ చేసుకున్నానని.. ఇదొక గొప్ప అనుభూతి అని తేజ్ మావయ్యతో వర్కింగ్ ఎక్స్పీరియెన్స్ ను పంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ అభిమాను పెళ్లి ఎప్పుడు అన్నా..? అంటూ ప్రశ్నించాడు. అందుకు తేజ్ `ఇంకెక్కడ పెళ్లి బ్రో.. ఈ సినిమా ముందు వరకూ ఎవరో ఒకరు కనీసం ట్రై చేసేవారు. కానీ, ఇప్పుడంతా నన్ను బ్రో అని పిలుస్తున్నారు` అని సమాధనం ఇచ్చి నవ్వులు పూయించాడు. మొత్తానికి బ్రో దెబ్బకు పెళ్లిపై ఇంట్రస్టే పోతుందని తేజ్ పరోక్షంగా కుండబద్దలు కొట్టేశాడు.