నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కెరీర్ ఆరంభం నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా బ్యూటీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్ లో తక్కువ సమయంలో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అలాగే పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ గా పాపులర్ అయింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో అల్లు అర్జున్ కు జోడీగా `పుష్ప 2` సినిమా చేస్తోంది. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయింది.
అలాగే బాలీవుడ్ లో సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రణబీర్ కపూర్ తో `యానిమల్` అనే మూవీలో నటిస్తోంది. వీటితో పాటు `రెయిన్ బో` అనే లేడీ ఓరియెంటెడ్ మూవీకి సైతం కమిట్ అయింది. చేతితో చిత్రాలతో బిజీగా ఉన్న రష్మిక.. తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా వారు అడిగిన అన్ని ప్రశ్నలకు రష్మిక ఓపిగ్గా సమాధానాలు ఇచ్చింది. ఓ నెటిజన్లు మీరు ఎన్ని భాషలు మాట్లాడగలరు? అని ప్రశ్నించగా.. తనకు ఆరు భాషలు వచ్చని, సినిమాల కోసమే అన్ని భాషలు నేర్చుకున్నానని, భాష తెలిస్తే నటించడం చాలా సులభం అవుతుందని రష్మిక చెప్పుకొచ్చింది.
ఈ క్రమంలోనే మరొక నెటినన్ ఈ వరల్డ్ లో మీకు ఇష్టమైన ప్లేస్ ఏది అని అడగగా.. కర్ణాటక రష్ట్రంలోని తన సొంత ఊరు కూర్గ్ అని రష్మిక బదులిచ్చింది. దీంతో బిస్కెట్ బాగానే వేసింది రోయ్ అంటూ ఆమెపై కొందరు సెటైర్లు పేలుస్తున్నారు. నిజానికి సొంత గడ్డ అయిన కర్ణాటకలో రష్మికపై తీవ్ర వ్యతిరేకత ఉంది. గతంలో తనకు కన్నడ రాదని రష్మిక వ్యాఖ్యానించడం, కాంతార వివాదంతో అక్కడ ఆమెపై పూర్తి నెగటివిటీ ఏర్పడింది. ఒకానొక సమయంలో రష్మికను బ్యాన్ చేయాలంటూ కన్నడ సినీ ప్రియులు డిమాండ్ చేశారు. అందుకే ఇప్పుడు తెలివిగా రష్మిక తనకు ఇష్టమైన ప్రదేశం కర్ణాటక రాష్ట్రంలోని తన సొంత ఊరు కూర్గ్ అని చెప్పి కన్నడ ప్రేక్షకులకు బిస్కెట్ వేసే ప్రయత్నం చేసిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.