టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన టాలెంటెడ్ బ్యూటీ ప్రియమణి.. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించింది. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంది. 2017లో బిజినెస్ మ్యాన్ ముస్తఫా రాజ్ ను ప్రియమణి ప్రేమ వివాహం చేసుకుంది. ముస్తఫా రాజ్ కు ఇది రెండో వివాహం. అప్పటికే ముస్తఫా రాజ్ కు ఒక పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు.
ఆ తర్వాత ప్రియమణితో ప్రేమలో పడటంతో.. ఆమెను రిజిస్టర్ ఆఫీస్ లో వివాహం చేసుకున్నాడు. పెళ్లి అనంతరం కొన్నాళ్లు నటనకు దూరంగా ఉన్నా.. మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలతో బిజీ అయింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పెద్ద పెద్ద సినిమాల్లో భాగం అవుతోంది. రీసెంట్ గా `కస్టడీ` మూవీలో నెగటివ్ షేడ్స్ ఉన్న సీఎం పాత్రలో అలరించిన ప్రియమణి.. త్వరలోనే `జవాన్` చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది. అయితే పెళ్లికి ముందు వరకు ఎలాంటి హద్దులు లేకుండా నటించిన ప్రియమణి.. పెళ్లి తర్వాత మాత్రం వెండితెరపై చాలా పద్ధతిగా కనిపిస్తోంది.
ముఖ్యంగా ముద్దు సిన్స్, రొమాంటిక్ సన్నివేశాలు ఉన్న పాత్రలు అస్సలు చేయడం లేదు. ఇందుకు కారణాన్ని తాజాగా ప్రియమణి వెల్లడించింది. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడుతూ.. `నేను పెళ్లి తర్వాత ముద్దు సీన్లలో నటించకూడదని డిసైడ్ అయ్యా. అలాంటి సీన్లలో నటిస్తే నా భర్తకు నేను సమాధానం చెప్పాల్సి వస్తుంది. నేను నటించే సినిమాలు మా ఇరు కుటుంబ సభ్యులు చూస్తారు. అలాంటి సీన్స్ వల్ల వాళ్లు ఇబ్బందిగా ఫీలవడం నాకు ఇష్టం లేదు. నా భర్త చాలా సాఫ్ట్ కార్నర్. వేరే వ్యక్తికి ముద్దిస్తే నా భర్త నాకు విడాకులు ఇచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. అందుకే సినిమా ఓకే చేసేముందే ఈ విషయాన్ని చెప్పేస్తున్నాను` అంటూ ప్రియమణి చెప్పుకొచ్చింది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.