ఒకప్పుడు టాలీవుడ్ లో ఎంతో ఫేమస్ అయినా హీరోయిన్స్ ఎంతో మంది ఉన్నారు. అయితే అప్పట్లో ఉన్న హీరోయిన్స్ హీరో కూతుర్లు ఇప్పుడు ఫేమస్ అవ్వలేకపోతున్నారు. అందులో ముఖ్యంగా రాజశేఖర్ జీవిత కూతుర్లు వారిద్దరి లాగా ఫేమస్ కాలేదు. ఇక విరే కాకుండా నటి రాధా, యాక్షన్ కింగ్ అర్జున్ , కూతుర్లు కూడా పెద్దగా సక్సెస్ సాధించలేకపోతున్నారు.
టాలీవుడ్ లో వీరిద్దరి కుమార్తెలు ఆశించిన స్థాయిలో సినీ పరిశ్రమలో రాణించలేదని తెలుస్తోంది. రాధా కూతుర్లు కార్తీక ,తులసి వీరిద్దరినీ హీరోయిన్గా పరిచయం చేసిన ఫెయిల్యూర్ గా మిగిలారు. జోష్ సినిమాతో కార్తీక పరిచయమై కొన్నాళ్లకే సినిమాలకు దూరమయ్యింది. ఇక మరో కూతురు రెండు సినిమాలకే ఫుల్ స్టాప్ పెట్టేసింది. అర్జున్ కుమార్తె ఐశ్వర్య కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలని చాలా ప్రయత్నాలు చేసింది.కన్నడలో కొన్ని సినిమాలు చేసి అవి తెలుగులో లాంచ్ చేయాలని ఓ సినిమా కూడా చేశారు కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం.
మెగా నిర్మాత, నటుడు నాగబాబు నటుడిగా సక్సెస్ కాలేకపోయినా వారి సోదరుల గుండా ఫేమస్ అయ్యాడు. హీరోగా ఇండస్ట్రీలో రాణించకపోయిన నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు.బుల్లితెర షో జబర్దస్త్ షో ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అయితే తన కుమారుడు వరుణ్ తేజ్ హీరో అయిన తరువాత నాగబాబు ఇంకాస్త ఫేమస్ అయ్యారు.నాగబాబు గారాలపట్టి నిహారిక ఈమె కూడా సినిమా పరంగా పెద్ద సక్సెస్ ని సాధించలేదు. మొదటగా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి అటుపై వెండితెరకు ప్రమోట్ అయింది. ఆ తరువాత వివాహ బంధం లోకి అడుగుపెట్టినా ఆ బంధం ముగిసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక ఈమె కాకుండా అక్కినేని సుప్రియ, తదితరులు సైతం ఉన్నారు