టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం `గుంటూరు కారం` మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమా అనంతరం దర్శకధీరుడు రాజమౌళితో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించబోతున్నాడు.
ఈ సంగతి పక్కన పెడితే.. మహేష్ బాబు తన సినీ కెరీర్ లో అనేక కథలను రిజెక్ట్ చేశాడు. వాటిలో కొన్ని ఫ్లాప్ అవ్వగా.. మరి కొన్ని హిట్ అయ్యాయి. అయితే అలా గతంలో మహేష్ బాబు రిజెక్ట్ చేసిన కథతో అక్కినేని నాగచైతన్య బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు `ఏ మాయ చేశావే`. నాగార్జున, సమంత ఇందులో జంటగా నటిస్తే.. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించాడు.
ఈ సినిమాతో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మితమైంది. తమిళంలో శింబు, త్రిష నటించారు. 2010లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే నిజానికి తెలుగులో ఈ సినిమాను గౌతమ్ మీనన్ మొదట మహేష్ బాబుతో తీయాలని అనుకున్నాడట. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబును కలిసి కథ కూడా చెప్పాడట. అయితే కథ నచ్చినప్పటికీ.. తన ఇమేజ్ కు సూట్ అవ్వదనే కారణంతో మహేష్ నో చెప్పాడట. దాంతో గౌతమ్ మీనన్ చైతూతో `ఏ మాయ చేశావే` మూవీని పట్టాలెక్కించాడు. అలా మహేష్ బాబు రిజెక్ట్ చేసిన కథతో నాగచైతన్య బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.