భ‌ర్త‌తో విడాకుల త‌ర్వాత నిహారిక ఫ‌స్ట్ పోస్ట్‌.. ఇంత‌కీ ఏం పెట్టిందో తెలిస్తే షాకే!

అంద‌రి అనుమానాలే నిజం అయ్యాయి. మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల‌, ఆమె భ‌ర్త చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ విడాకులు తీసుకున్నారు. హైద‌రాబాద్ లోని కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్డులో నిహారిక, చైత‌న్య మే నెల‌లో పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. గ‌త నెల‌లో వీరిద్ద‌రికీ కోర్డు విడాకులు మంజూరు చేసింది. తాజాగా ఈ విష‌యం మీడియా ద్వారా బ‌య‌ట ప‌డ‌టంతో.. నిహారిక విడాకులు నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి.

2020లో నిహారిక‌, చైత‌న్య పెళ్లి చేసుకున్నారు. వివాహం త‌ర్వాత త‌న భ‌ర్త‌కు ఇష్టం లేక‌పోవ‌డంతో న‌ట‌న‌కు బ్రేక్ ఇచ్చిన నిహారిక‌.. నిర్మాత‌గా మారింది. ఎప్పుడైతే చైత‌న్య‌కు దూర‌మైందో నిహారిక మ‌ళ్లీ న‌టించ‌డం స్టార్ట్ చేసింది. ప్ర‌స్తుతం న‌టిగా, నిర్మాత‌గా స‌త్తా చాటేందుకు నిహారిక కృషి చేస్తోంది. అయితే తాజాగా విడాకులు మ్యార‌ట్ బ‌ట‌య‌కు రావ‌డంతో.. నిహారిక ఎలా రెస్పాండ్ అవుతుందా అని అంద‌రూ ఎంతో ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఇలాంటి త‌రుణంలోనే నిహారికి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టి అంద‌రికీ షాకిచ్చింది. ఎందుకంటే, అది త‌న విడాకుల‌కు సంబంధించింది కాదు. త‌న సినిమాల‌కు ఆమెరికా నుంచి ప్ర‌మోష‌న్స్ చేస్తున్న‌టువంటి సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స‌ర్ కు బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ నిహారిక స్టోరీ షేర్ చేసింది. అటు ప్ర‌ధాన మీడియాతో పాటు ఇటు సోష‌ల్ మీడియాలోనూ నిహారిక-చైతన్య విడాకుల విష‌య‌మే ట్రెండ్ అవుతోంది. వీరి డివోర్స్ పై ఎన్నో ర‌కాల వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. కానీ, మెగా డాట‌ర్ మాత్రం అస‌లు ఆ సంగ‌తే ప‌ట్టించుకోకుండా త‌న ప‌ని తాను చేసుకుంటోంది. తాను ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్ ల‌తో బిజీగా గ‌డుపుతోంది.