టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ హిట్ ముఖం చూసి చాలా కాలమే అయిపోయింది. సీటీమార్ మూవీతో హిట్ అందుకున్నాడు అనుకునే లోపే గోపీచంద్ ఖాతాలో పక్కా కమర్షియల్, రామబాణం రూపంలో రెండు ఫ్లాపులు పడ్డాయి. ప్రస్తుతం ఈయన `భీమా` అనే మూవీ చేస్తున్నాడు. ఏ. హర్ష దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు.
చాలా ఏళ్ల తర్వాత మరోసారి ఈ మూవీ కోసం గోపీచంద్ ఖాకీ చొక్కా వేస్తున్నాడు. ఇందులో ఆయన పవర్ఫుల్ పోలీసాఫీసర్గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా ఇప్పుడు షూటింగ్ దశలో ఉంది. ఈ సంగతి పక్కన పెడితే.. గోపీచంద్ కు సంబంధించి ఓ షాకింగ్ బయటకు వచ్చింది. అదేంటంటే.. గోపీచంద్ మళ్లీ విలన్ గా మారబోతున్నాడట. కెరీర్ ఆరంభంలో ఆయన జయం, నిజం, వర్షం చిత్రాల్లో విలన్ విశ్వరూపం చూపించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.
హీరోగా నిలదొక్కుకున్నాక విలన్ పాత్రలు చేయలేదు. ఇటీవల రామబాణం ప్రమోషన్స్ లో `విలన్ రోల్స్ లో ఛాన్స్ వస్తే నటిస్తారా..? అని ప్రశ్నిస్తే.. మంచి కథ దొరికితే చేస్తా అని గోపీచంద్ సమాధానం ఇచ్చారు. అయితే తాజాగా ఓ స్టార్ హీరో మూవీలో గోపీచంద్ కు విలన్ గా చేసే ఆఫర్ వచ్చిందట. అందులో హీరోతో సమానంగా విలన్ పాత్ర ఉంటుందట. భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారట. దాంతో గోపీచంద్ సంచలన నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. హీరోగానే కాకుండా విలన్ గానూ చేయాలని డిసైడ్ అయిన గోపీచంద్.. ఆ ప్రాజెక్ట్ కు సైన్ చేశాడని నెట్టింట ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారమే నిజమై గోపీచంద్ మళ్లీ విలన్ గా మారితే.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.