సూపర్ స్టార్ మహేష్ బాబుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అందుకు కారణం లేకపోలేదు. ప్రస్తుతం మహేష్ బాబు `గుంటూరు కారం` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, పూజా హెగ్డే హీరోయిన్లుగా ఎంపిక అయింది. అయితే రీసెంట్ గా పూజా హెగ్డే ఈ మూవీని తప్పుకుంది.
దాంతో `హిట్ 2` మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మీనాక్షి చైదరిని తీసుకున్నారు. అయితే ఈ సినిమాను ఏ ముహూర్తాన స్టార్ట్ చేశారో కానీ, ఆది నుంచి అడ్డంకులు ఎదురువుతూనే ఉన్నాయి. షూటింగ్ కు బ్రేకుల మీద బ్రేకులు పడుతూనే ఉన్నాయి. చాలా రోజుల తర్వాత రీసెంట్ గానే గుంటూరు కారం కొత్త షెడ్యూల్ ను ప్రారంభించారు. అయితే షెడ్యూల్ పూర్తైందో లేదో.. మళ్లీ కొద్ది రోజులు షూటింగ్ కు బ్రేక్ ఇస్తున్నారు. మహేష్ బాబు ఈనెల 19వ తేదీన కుటుంబంతో కలిసి లండన్ వెళ్లబోతున్నాడు. మహేష్ తనయుడు గౌతమ్ లండన్ లో ఉన్నత చదువులు చదువుతున్న విషయం తెల్సిందే.
అయితే అక్కడ కు ప్రత్యేక కార్యక్రమం లో పాల్గొనేందుకు మహేష్ బాబు వెల్లబోతున్నాడు. వారం రోజుల మాత్రం అక్కడ స్టే చేయనున్నాడు. ఈ నేపథ్యంలోనే గుంటూరు కారం షూటింగ్ కు చిన్న బ్రేక్ పడబోతోంది. ఈ విషయం తెలిసి నెటిజన్లు ఇలాగైతే గుంటూరు కారం షూటింగ్ కంప్లీట్ అయినట్లే అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. ఎన్టీఆర్ ను చూసైనా నేర్చుకో మహేషా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎన్టీఆర్ `దేవర` లేట్ గా ప్రారంభం అయినా.. బ్రేక్ అనేదే లేకుండా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఐదు షెడ్యూల్స్ ను కంప్లీట్ చేశారు. అయినాసరే గ్యాప్ లేకుండా మరో భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేసుకున్నారు. ఎన్టీఆర్ హాలిడేస్ లో కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ ను అడ్డుపెట్టుకుని మహేష్ బాబుపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.