మహేష్ బాబు కంటే ముందే ఆ వ్యక్తిని గాఢంగా ప్రేమించిన నమ్రత.. ఎవరంటే…

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న నమ్రత టాలీవుడ్ కి వచ్చి మహేష్ తో ‘వంశీ ‘ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మహేష్ బాబు తో ప్రేమలో పడిపోయింది. అయితే వీరిద్దరి పెళ్ళికి నమ్రత కుటుంబ సభ్యులు ఒప్పుకున్నప్పటికీ, మహేష్ బాబు కుటుంబ సభ్యులు మాత్రం కాస్త మొండికేసారట. ముఖ్యంగా మహేష్ బాబు తండ్రి కృష్ణ, నమ్రత ని తన ఇంటి కోడలు చేసుకోడం ఇష్టం లేదని చెప్పేశారట. కొన్నేళ్ళకి ఇందిరా దేవి, మంజుల ఇద్దరు కలిసి కృష్ణ ని ఒప్పించి మహేష్, నమ్రతల కి పెళ్లి చేసారు.

అయితే కృష్ణ , నమ్రత ని తన ఇంటి కోడలిగా ఒప్పుకోకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అదేంటంటే నమ్రత,మహేష్ తో ప్రేమ లో పడడం కంటే ముందే బాలీవుడ్ ఇండస్ట్రీ లో వేరే హీరోతో ఏఫైర్ నడుపుతుంది అనే వార్తలు వచ్చాయి. అందుకే నమ్రత,మహేష్ ల పెళ్లికి కృష్ణ ఒప్పుకోలేదు. మరి మహేష్ బాబు కంటే ముందుగానే నమ్రత ఎవరిని ప్రేమించిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమ్రత బాలీవుడ్ స్టార్ హీరో అయిన సంజయ్ దత్ తో ప్రేమలో ఉందని వార్తలు అప్పట్లో బాగా వినిపించాయి. అయితే సంజయ్ దత్ తో కలిసి వాస్తవ్, కార్గిల్ లాంటి సినిమా లో నటించింది నమ్రత. నిజానికి ఒక హీరో హీరోయిన్ కలిసి రెండు మూడు సినిమాల్లో నటిస్తే వారి మధ్య ఏదో ఉందంటూ ప్రచారం చేయడం సర్వసాధారణం.

అలానే నమ్రత,సంజయ్ దత్ కలిసి రెండు మూడు సినిమాల్లో నటించారు. అంతేకాకుండా ఒక సినిమాలో సంజయ్ దత్ తో ఘాటు రొమాంటిక్ సీన్స్ లో నమ్రత నటించింది. ఆ సినిమా రిలీజ్ అయిన తరువాత నుండి  విరిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ ప్రచారం చేసారు. అయితే ఇప్పుడు నమ్రత, మహేష్ ని పెళ్లి చేసుకొని ఇరవై ఏళ్ళు పూర్తి కాభోతుంది. అయినప్పటికీ ఆమేపై ఎలాంటి రోమర్స్ రాలేదు. ఇంట్లోనే ఉంటూ,పిల్లల్ని చూసుకుంటూ,మహేష్ బిసినెస్ వ్యవహారాలు చూసుకుంటు నమ్రత హ్యాపీగా ఉంటుంది.