మీనాక్షి చౌదరి.. ఈ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఇచట వాహనములు నిలుపరాదు` మూవీతో తెలుగు తెరకు పరిచయైన ఈ అందాల సోయగం.. ఆ తర్వాత రవితేజతో ఖిలాడీలో నటించింది. ఈ రెండు సినిమాలు ఆమెకు సక్సెస్ ఇవ్వలేకపోయాయి. అయితే అడివి శేష్ హీరోగా తెరకెక్కిన `హిట్ 2` మూవీతో మీనాక్షి చౌదరి తొలి విజయాన్ని అందుకుంది.
అయితే హిట్ 2 వంటి బ్లాక్ బస్టర్ పడినా.. మీనాక్షి చౌదరికి ఆఫర్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో మహేష్ బాబుకు జోడీగా `గుంటూరు కారం`లో నటించే అవకాశం దక్కింది. పూజా హెగ్డే ఈ మూవీ నుంచి తప్పుకోవడంతో శ్రీలీలను మెయిన్ హీరోయిన్ గా చేసి మీనాక్షిని సెకండ్ హీరోయిన్ గా ఎంపిక చేశారు. దీంతో మీనాక్షి ఒక్కసారిగా హెడ్లైన్స్ లో నిలిచింది. అందరి చూపులు ఆమెపైనే పడ్డాయి.
ఇక మహేష్ బాబు పేరు చెప్పుకుని ఈ ముద్దుగుమ్మ మెగా ఆఫర్ కొట్టేసింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో నటించే అవకాశాన్ని అందుకుంది. వరుణ్తేజ్ కథానాయకుడిగా ‘పలాస’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించబోతున్నారు. జూలై 27న ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఇందులో హీరోయిన్ గా మీనాక్షి చైదరిని ఎంపిక చేశారు. ఇప్పటికే సంప్రదింపులు సైతం పూర్తి అయ్యాయి. మరోవైపు విశ్వక్ సేన్ తో కూడా ఈ బ్యూటీ ఓ మూవీకి కమిట్ అయింది.