మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం భోళా శంకర్.. ఇందులో హీరోయిన్ గా తమన్నా నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేయడం జరిగింది.. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఈ సినిమాకి చిరంజీవి రెమ్యూనరేషన్ తీసుకోలేదని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
గతంలో గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య వంటి సినిమాలతో ఘనవిజయం సాధించడంతో ఫుల్ జోష్ మీద ఉన్నారు చిరంజీవి.. ఒకవేళ ఇదే ఊపు కంటిన్యూ అయితే తమిళ చిత్రం వేదాళంగా రీమేక్ తెరకెక్కించిన భోళా శంకర్ సినిమాకి చిరంజీవి ఒక రూపాయి కూడా తీసుకోలేదట.. ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తామని నిర్మాతలు చెప్పిన చిరంజీవి వద్దని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే విడుదలయ్యాక లాభాలలో వస్తే అందులో షేర్ తీసుకుంటానని తెలియజేశారట. చిరంజీవి ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
అందుకు సంబంధించి ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా పైన చిరంజీవికి ఎంత నమ్మకం ఉండబట్టే ఇలా చేశారని అభిమానుల సైతం తెలియజేస్తున్నారు.. భోళా శంకర్ సినిమా థియేటర్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలి పాత్రలో నటిస్తూ ఉండగా ఈమెకు జోడిగా సుశాంత్ నటించబోతున్నారు. రవిబాబు, మురళి శర్మ, వెన్నెల కిషోర్ తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. భారీ అంచనాల మధ్య వచ్చే నెల 11వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది.