సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన చిత్రం దూకుడు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శీను వైట్ల దర్శకత్వం వహించారు… వాస్తవానికి మహేష్ కు పోకిరి తర్వాత అంతటి బ్లాక్ బాస్టర్ సినిమా దూకుడు మాత్రమే ఇచ్చిందని చెప్పవచ్చు. మహేష్ అభిమానులు నిరాశగా ఉన్న సమయంలో దూకుడు సినిమా విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలడమే కాకుండా కలెక్షన్ల పరంగా ఇండస్ట్రీ హిట్టునే అందుకుంది.
ఇక దూకుడు తర్వాత వెంటనే శ్రీనువైట్ల దర్శకత్వంలో ఆగడు సినిమాని చేశారు.అయితే ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైన ప్రేక్షకులను నిరాశపరిచింది.. దూకుడు వంటి భారీ విజయం వచ్చిన తర్వాత ఆగడు సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో తాజాగా ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ శ్రీనువైట్ల మాట్లాడుతూ ఆగడు సినిమా ఫ్లాప్ కావడానికి కారణాన్ని తెలియజేయడం జరిగింది.. మహేష్ బాబు అభిమానులు దూకుడు తర్వాత మాస్ సినిమా కావాలని అడిగారట.. కానీ నాది ఆ స్టైల్ కాదు ఆగడు సినిమా సల్మాన్ ఖాన్ టైగర్ జిందా హై అనే సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యి తీశానని తెలిపారు.
అయితే ఆగడు సినిమా తెరకెక్కించిన నిర్మాతలు అప్పటికి ఒక పెద్ద ఫ్లాప్ వచ్చింది.. దీంతో వాళ్లు మహేష్ సినిమాని సింపులుగా చేయాలన్నారు.. రూరల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయమని చెప్పారు. కానీ నేను కూడా మహేష్ లో ఉన్న ఎలివేన్స్ అన్ని బయట పెట్టాలని బ్రేత్ లెస్ డైలాగులు కూడా రాశాను.. చాలా కష్టపడ్డాను కూడా కానీ ఇవేం వర్క్ అవుట్ కాలేదు.. కానీ మహేష్ బాబు దీనిపైన నన్ను బ్లెం చేయలేదు.. సినిమా ఫ్లాప్ అయిన తర్వాత కూడా మహేష్ నాతోనే ఉన్నారని తెలియజేశారు శ్రీనువైట్ల.