తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు మీద ఉన్న విషయం తెలిసిందే. ఆ పార్టీకి ఊహించని మైలేజ్ వచ్చింది. అదే సమయంలో కాంగ్రెస్ లోకి వలసల జోరు కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు బిఆర్ఎస్, బిజేపి నేతలు కాంగ్రెస్ లో చేరారు. మరికొందరు పార్టీలో చేరడానికి రెడీగా ఉన్నారు. అయితే ఇలా కాంగ్రెస్ బలపడుతున్న నేపథ్యంలో కేసిఆర్ సైలెంట్ గా ఉండరు కదా..కాంగ్రెస్ కు చెక్ పెట్టే దిశగా ఆయన పావులు కదుపుతున్నారు.
ఇప్పటికే గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ని చావు దెబ్బ తీశారు. ఆ పార్టీలోని ఎమ్మెల్యేలని లాగేసుకున్నారు. అయినా సరే కాంగ్రెస్ మళ్ళీ పుంజుకుంటుంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేసిఆర్ రివర్స్ స్కెచ్ వేయడం మొదలుపెట్టారు. కాంగ్రెస్కు బలమైన చోట డ్యామేజ్ చేయడానికి చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ దెబ్బ కొట్టి సత్తా చాటాలని కేసిఆర్ చూస్తున్నారు.
అయితే ఇటీవల కొందరు బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ వైపు వెళుతున్న విషయం తెలిసిందే. ఇక అదే సమయంలో కాంగ్రెస్ లోని కీలక నేతలని బిఆర్ఎస్ లోకి వచ్చేలా కేసిఆర్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా యదాద్రి జిల్లా డిసిసి అధ్యక్షుడు అనిల్ రెడ్డిని బిఆర్ఎస్ లోకి తీసుకొచ్చారు. ఇక ఈయనకు భువనగిరి సీటు ఇస్తారని ప్రచారం ఉంది. ఈయనకు అక్కడ గట్టి పట్టు ఉంది. అలాగే జిల్లాలో మరో సీనియర్ నేతపై కూడా కేసిఆర్ ఫోకస్ పెట్టారని తెలిసింది.
అయితే ఇప్పటికే ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ మారుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ ఆయన పక్కా కాంగ్రెస్ వాది. ఆయన పార్టీ మారడం జరిగే పని కాదు. మరి కేసిఆర్ ఫోకస్ ఏ సీనియడ్ నాయకుడుపై ఉందో చూడాలి. కాంగ్రెస్ని ఎంతవరకు నిలువరిస్తారో.