వైష్ణవి చైతన్య గురించి కీలక అప్‌డేట్.. ఖుషి అవుతున్న బిగ్‌బాస్ ఫ్యాన్స్!

త్వరలోనే తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాల్టీ షో అయిన బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం కాభోతుంది. ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించిన ప్రోమో విడుదలై ప్రేక్షకులకు ఇంకాస్త ఆసక్తిని పెంచేసింది. ప్రోమో విడుదల అయింది కాబ్బటి ప్రేక్షకులు కాంటెస్టెంట్స్ గా ఎవరెవరు వస్తారా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దాంతో కంటెస్టెంట్ల విషయంలో సోషల్ మీడియాలో రకరకాల పుట్టుకొస్తున్నాయి. తమకు నచ్చిన సెలబ్రిటి పేర్లు చెప్పి వారే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంటూ ప్రచారం చేస్తున్నారు.

నిజానికి బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ లిస్ట్ ఇంకా పూర్తి కాలేదు కాబ్బటి దానికి సంబందించిన వివరాలు ఎవరికి పూర్తిగా తెలీవు. మొదటి బిగ్ బాస్ సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహారించారు. ఆ తరువాత నేచరల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహారించారు. ఆ తరువాత మూడవ సీజన్ నుండి ఇప్పుడు రాభోయే 7 వ సీజన్ వరకూ అక్కినేని నాగార్జున నే బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహారిస్తున్నారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ సీజన్ 7  కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ అవుతు ప్రేక్షకులను హల్ చల్ చేస్తుంది.

సీజన్ 6 లో జరిగిన మిస్టేక్స్ రాబోయే సీజన్ లో రాకూడదు అని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని నిర్వాహకులు, మేకర్స్ ప్రకటించారు. ఈసారి కంటెస్టెంట్స్ గా బాగా ఫేమస్ అయిన యూట్యూబర్స్, కొరియోగ్రాఫర్స్, సీరియల్స్ నటులను సెలెక్ట్ చేస్తున్నారు. అయితే ఇంకా ఫైనల్ లిస్ట్ ని మాత్రం ప్రకటించలేదు. అయితే బేబీ సినిమా లోని హీరోయిన్ వైష్ణవి ఈసారి బిగ్ బాస్ లోకి రాబోతుంది అంటూ సోషల్ మీడియా లో ప్రచారం గట్టిగ చేస్తున్నారు. దాంతో వైష్ణవి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. కానీ ఈ విషయం గురించి బిగ్ బాస్ ఒక క్లారిటీ ఇచ్చే వరకూ వైష్ణవి హౌస్ లోకి వస్తుందా లేదా అనేది ఎవరికి తెలీదు.