నాగబాబు ముద్దులు కుమార్తె, నటి, నిర్మాత నిహారిక-చైతన్య జొన్నలగడ్డ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. గత కొద్ది నెలల నుంచి దూరంగా ఉంటున్న ఈ జంట.. గత నెలలో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. హైదరాబాద్ లోని కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టు వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. అయితే నిహారిక విడాకుల వల్ల ఆమె తండ్రి నాగబాబుకు ఎన్ని కోట్ల నష్టం వచ్చిందో తెలిస్తే కళ్లు తేలేస్తారు.
నిహారిక-చైతన్య 2020 డిసెంబర్ 9న వివాహం చేసుకున్నారు. అది కూడా అలా ఇలా కాదు.. వీరి పెళ్లిని రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ లో నాగబాబు అత్యంత ఘనంగా నిర్వహించారు. మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వీరి పెళ్లి వేడుకలో సందడి చేశారు. నాలుగు రోజుల పాటు సంగీత్, హల్దీ, మెహందీ అంటూ పెళ్లికి ముందు అన్ని కార్యక్రమాలను అక్కడే నిర్వహించారు. ఈ ప్యాలెజ్ ఒక రోజు రెంటే రూ.2 కోట్లు.
నిహారిక-చైతన్య పెళ్లి వేడుకను నాలుగు రోజుల పాటు నిర్వహించడంతో.. ప్యాలెస్ రెంట్, అక్కడ ఏర్పాట్ల కోసం మొత్తంగా రూ.12 కోట్ల వరకు నాగబాబు ఖర్చు చేశాడు. అతిథుల కోసం స్పెషల్ ఫ్లైట్లు, భోజనం, బట్టలు, జ్యువెలరీ.. ఇలా అన్నింటి ఇంకొంత ఖర్చు అయింది. ఇక అల్లుడు చైతన్యకు కట్నకానుకలను కూడా నాగబాబు గట్టిగానే పెట్టారు. అల్లుడికి గిఫ్ట్ లో హైదారాబాద్ లో ఓ లగ్జరీ ఫ్లాట్ ను రాసి ఇచ్చారు. ఖరీదైన కారును కూడా చైతన్యకు కానుకగా ఇచ్చారు. మొత్తానికి నిహారిక పెళ్లి పేరిట రూ. 50 కోట్లు వరకు నాగార్జున ఖర్చు చేశారట. కానీ, పెళ్లై మూడేళ్లు గడవక ముందే నిహారిక చైతన్యతో విడిపోయింది.