టాలీవుడ్ బాలీవుడ్ ప్రేక్షకులకు హాట్ బ్యూటీగా పేరుపొందిన మౌని రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మొదట నాగిని సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన ఈ అమ్మడు ఆ పాపులారిటీతోనే పలు చిత్రాలలోని అవకాశాలను కూడా అందుకుంది. అలాగే గత ఏడాది బ్రహ్మాస్త్ర సినిమాలో విలన్ గా నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ పలు రకాల బికీని బ్రాండ్లకు కూడా అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఉంటుంది. నిరంతరం తన గ్లామర్ తోనే చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటుంది మౌని రాయ్.
తాజాగా ఈ అమ్మడు గత తొమ్మిది రోజుల నుంచి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది… అసలు విషయంలోకి వెళ్తే తన హెల్త్ కండిషన్ గురించి మౌని రాయ్ మాట్లాడుతూ గత కొద్ది రోజుల క్రితం సీరియస్ హెల్త్ ప్రాబ్లం రావడంతో ముంబైలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయినట్లుగా తెలుస్తోంది. దాదాపుగా తొమ్మిది రోజులపాటు ఆమెకు వైద్యులు చికిత్స అందించినట్లుగా తెలిపింది.. ఇక డిశ్చార్జ్ అయ్యే రోజు సందర్భంగా తన ఇంస్టాగ్రామ్ లో హాస్పిటల్లో తన తొమ్మిది రోజులు ఎలా గెలిచాయి అనే విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది.
ఇక ఆ సమయంలో అండగా ఉన్న భర్తకు స్నేహితులకు థాంక్స్ తెలియజేయడం జరిగింది మౌని రాయ్.. తొమ్మిది రోజులు హాస్పిటల్లో ఉన్నప్పటికీ తనకు తెలిసిన దానికంటే లోతైన వాటిలో మునిగిపోయాను ఇప్పుడు నేను ఇంటికి తిరిగి వచ్చాను చాలా నెమ్మదిగా కోరుకుంటున్నాను ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉంది అభిమానులు ఆందోళన పడవద్దు అంటూ తెలియజేస్తోంది. ఇక తన భర్త సంబియార్ ఇటువంటివారు ఎవరూ లేరు.. తనపై ఇంత ప్రేమ చూపిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని తెలియజేసింది. కానీ తన అనారోగ్యానికి కారణం ఏంటనే విషయాన్ని మాత్రం తెలపలేదు.
View this post on Instagram