మెగాస్టార్ చిరంజీవి ఓ కొత్త సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు.. ఇటీవల విడుదలైన చిరంజీవి ప్రతి సినిమాలో ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుంది. ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటంటే.. చిరంజీవి తన ప్రతీ సినిమాలో మరొక హీరో ఉండేట్టు చూసుకుంటున్నారు. ముఖ్యంగా యంగ్ హీరోలపై చిరంజీవి ఎక్కువగా మక్కువ చూపుతున్నారు.
గాడ్ ఫాదర్ సినిమాలో సత్యదేవ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న మెగాస్టార్.. రీసెంట్ బ్లాక్ బస్టర్ వాల్తేరు వీరయ్యలో రవితేజతో కలిసి నటించాడు. ప్రస్తుతం చిరంజీవి `భోళా శంకర్` సినిమా చేస్తున్నాడు. మెహర్ రమేష్ ఈ మూవీకి దర్శకుడు. తమన్నా హీరోయిన్ గా నటిస్తుంటే.. కీర్తి సురేష్ చిరంజీవికి సోదరి పాత్రను పోషిస్తోంది. ఈ సినిమాలోనూ ఓ యంగ్ హీరో ఉన్నాడు. అతనెవరో కాదు అక్కినేని మేనల్లుడు సుశాంత్.
వచ్చే నెలలో భోళా శంకర్ విడుదల కాబోతోంది. ఈ సినిమా అనంతరం కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో ఓ మూవీని పట్టాలెక్కించబోతున్నాడు. అయితే ఈ సినిమాలో ఇద్దరు యంగ్ హీరోలు చిరంజీవితో కలిసి సందడి చేయబోతున్నారు. అందులో సిద్దు జొన్నలగడ్డ ఒకడు కాగా.. మరొకడు కార్తికేయ. చిరంజీవి నెక్స్ట్ మూవీలో సిద్దు జొన్నలగడ్డ కీలకపాత్రలో నటించబోతున్నాడు. అలాగే విలన్గా యంగ్ హీరో కార్తికేయను ఎంపిక చేశారట. మొత్తానికి యంగ్ స్టార్స్ తో చేస్తే తన వయస్సు మర్చిపోవచ్చని అనుకుంటున్నారో ఏమో కాని ఈ మధ్య తన ప్రతి సినిమాలోనూ ఓ యంగ్ హీరో ఉండేలా చిరంజీవి చూసుకుంటున్నారు.