బాలయ్య మనసు నిజంగానే బంగారం.. ఇంత‌కంటే సాక్ష్యం కావాలా..?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం ఆమెరికా టూర్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. రీసెంట్ గా బాల‌య్య తన సతీమణి వసుంధర దేవి, మనవడితో కలిసి వెకేష‌న్ కోసం అమెరికా వెళ్లారు. అమెరికాలోని పెన్సిల్వేనియాలో తానా మహాసభలు ఎంతో గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఈ సభ నిర్వాహ‌కుల నుంచి బాల‌య్య‌కు ఆహ్వానం అందింది. దీంతో బాల‌య్య సైతం తానా మహాసభలకు హాజ‌రు అవుతున్నారు.

ఈ క్ర‌మంలోనే ఓ అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. ఓ మ‌హిళా అభిమాని బాలయ్య దంపతులను ప్రత్యేకంగా కలిశారు. తన పుట్టిన రోజు అని చెప్పి.. ఆశీసులు అడిగింది. వెంట‌నే బాల‌య్య ఆమె కోసం కేక్ తెప్పించి.. క‌ట్ చేయించారు. అనంతరం బాలకృష్ణ, ఆయన సతీమణి అక్షింతలు వేసి ఆ అమ్మాయిని మనసారా ఆశీర్వదించారు. దీంతో స‌ద‌రు అభిమాని ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి.

ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుండ‌టంతో.. బాల‌య్య‌పై నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. బాలయ్య మనసు బంగారం అని చెప్ప‌డానికి ఇంత‌కంటే సాక్ష్యం అక్క‌ర్లేదు కొనియాడుతున్నారు. నిజానికి బాల‌య్య పైకి గంభీరంగా కనిపించినా.. ఆయనది చిన్న‌పిల్ల‌వాడి మ‌న‌స్త‌త్వం.

చాలాసార్లు అభిమానుల మీద కస్సుబుస్సులాడినా.. ఆయ‌న‌కు ఫ్యాన్స్ అంటే ఎంతో మ‌మ‌కారం. ఒక్క‌సారి ఎవ‌రైనా న‌చ్చారు అంటే.. బాల‌య్య వారి కోసం ఎంత దూరం అయినా వెళ్లాడు.. ఏమైనా చేస్తాడు. ఇటీవల విమానంలో పరిచయమైన ఓ వ్యక్తి గృహప్రవేశానికి వెళ్లి హెడ్‌లైన్స్ లో నిలిచిన బాల‌య్య‌.. ఇప్పుడు అభిమాని బ‌ర్త్‌డేను సెల‌బ్రేట్ చేసి మ‌రోసారి అంద‌రి మ‌నసులు దోచేశాడు.