ఆనంద్ దేవరకొండ గురించి పరిచయాలు అవసరం లేదు. ఆమెరికాలో కొంతకాలం జాబ్ చేసిన ఆనంద్ దేవరకొండ.. సినిమాలపై ఇంట్రెస్ట్ తో జాబ్ వదిలేసి ఇండియాకు వచ్చేశాడు. విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆనంద్.. దొరసాని మూవీతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేశాడు. ఆ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. మిడిల్ క్లాస్ మెలోడీస్, పుష్పక విమానం చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
ప్రస్తుతం `బేబీ` మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇదొక ట్రైయాంగిల్ లవ్ స్టోరీ. ఇందులో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తే.. విరాజ్ అశ్విన్ కీలక పాత్రను పోషించాడు. జులై 14న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయబోతోంది. దీంతో చిత్ర టీమ్ జోరుగా ప్రచారకార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే యంగ్ హీరోయిన్ వర్ష బొల్లమతో ఆనంద్ ప్రేమలో పడ్డాడని గతంలో జోరుగా ప్రచారం జరిగింది.
వీరిద్దరూ `మిడిల్ క్లాస్ మెలోడీస్` మూవీలో నటించారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారిందని వార్తలు వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయంపై ఆనంద్ దేవరకొండను ప్రశ్నించగా.. అతను ఆసక్తికర కామెంట్స్ చేశాడు. `వర్ష నాకు బెస్ట్ ఫ్రెండ్. అందుకు మించి ఏమీ లేదు. మేం ఇద్దరం డాగ్ లవర్స్. కుక్కల గురించి ఎక్కువ మాట్లాడుతూ బాగా కనెక్ట్ అయిపోయాం. అలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. ఇంకా చెప్పాలంటే ఆమె నాకు చాలా స్పెషల్ ఫ్రెండ్ అంతే` అంటూ ఆనంద్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి వర్ష తనకు చాలా స్పెషల్ అంటున్నాడు కానీ ప్రేమ దోమా లేదని ఆనంద్ తేల్చేశాడు.