ఆ స్టార్ డైరెక్ట‌ర్ తో `వ‌న్స్ మోర్` అంటున్న అల్లు అర్జున్‌.. ఇక ఫ్యాన్స్ కి పండ‌గే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప 2` చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పుష్ప మొద‌టి భాగం పాన్ ఇండియా స్థాయిలో సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేయ‌డంతో.. రెండో భాగంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఆ అంచ‌నాల‌కు ఏమాత్రం తీసిపోని విధంగా సుకుమార్ రెండో భాగాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ మూవీ అనంత‌రం అల్లు అర్జున్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తో త‌న త‌దుప‌రి చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నాడు.

ఆల్రెడీ వీరి కాంబోలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో వంటి చిత్రాలు వ‌చ్చాయి. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్ డూప‌ర్ హిట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా అల వైకుంఠపురంలో సినిమా ఇండ‌స్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే ఇప్పుడు త్రివిక్ర‌మ్ తో అల్లు అర్జున్ వ‌న్స్ మోర్ అంటున్నాడు. వీరి క‌ల‌యిక‌లో నాలుగో సినిమా ఉంటుందంటూ కొంతకాలం ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ ఊహాగానాలే నిజం అయ్యాయి. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో నాలుగో సినిమాపై అనౌన్స్‌మెంట్ వ‌చ్చింది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్ల‌పై ఈ చిత్రం నిర్మితం కానుంది. అది కూడా పాన్ ఇండియన్ లెవల్ లో నిర్మించ‌బోతున్నారు. ఈ మేర‌కు చిత్ర‌టీమ్ ఒక చిన్న వీడియోను వ‌దిలారు. ఈ విష‌యం తెలిసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కు రానున్నాయ‌ని చిత్ర టీమ్ పేర్కొంది.