చిరంజీవితో నైనా యాంకర్ రష్మీ ఫేట్ మారేనా..?

తెలుగు ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ యాంకర్ గా పేరుపొందింది యాంకర్ రష్మీ.. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న రష్మి పలు చిత్రాలలో కూడా హీరోయిన్గా నటించింది.కానీ ఏ సినిమా కూడా ఈమెకు పెద్దగా సక్సెస్ రాలేదని చెప్పవచ్చు. గుంటూరు టాకీస్ సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకున్న రష్మీ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించింది.. ఇప్పుడు తాజాగా చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో పవన్ ను ఇమిటేట్ చేస్తానంటూ ఒక షాకింగ్ అప్డేట్ ఇవ్వడం జరిగింది.ఈ వీడియో అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.

తాజాగా రష్మీ లీక్ చేసిన ఈ వీడియోలో చిరంజీవితో పాటు రష్మీ కూడా కనిపించడం జరిగింది. భోళా శంకర్ సినిమాలో రష్మీ ముఖ్యమైన పాత్ర లో నటించబోతోంది అంటూ వార్త వినిపిస్తున్నాయి . చిరంజీవి సినిమాతో నైనా రష్మీ జాతకం బారబోతోందా అంటు అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. రష్మీకి సక్సెస్ రేట్ మాత్రం చాలా తక్కువగానే ఉంది. ఈ సినిమాతో సెంటిమెంట్ ను బ్రేక్ చేయడం ఖాయమంటూ పలువురు విశ్లేషకులు తెలియజేస్తున్నారు.

 

రష్మీ చిరంజీవితో నటించేందుకు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుందనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇక పవన్ అభిమానులు కూడా భోళా శంకర్ చిత్రం కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఆగస్టు నెలలో విడుదల కాబోతున్న ఈ చిత్రం ఏ మేరకు అభిమానులను మెప్పించి ఎలాంటి ఫలితాలని అందుకుంటుందేమో చూడాలి మరి. భోళా శంకర్ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. చిరంజీవి కూడా ఈ సినిమాకి రూ .35 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రం కోల్కతా బ్యాక్ గ్రౌండ్ తెరకెక్కిస్తున్నారు మరి రష్మిక ఫెట్ చిరంజీవి మారుస్తారేమో చూడాలి.