పెళ్లయ్యాక నాగబాబు నుంచి విడిపోనున్న వరుణ్ తేజ్.. అదే కారణమా..

త్వరలోనే మెగా కుటుంబంలో పెళ్లి జరగబోతుందనే వార్త తెలిసి కుటుంబ సభ్యులతో పాటు మెగా అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రచారం అవుతున్న ఒక వార్త మాత్రం మెగా అభిమానులలో భయం పుట్టిస్తుంది. అదేంటంటే, పెళ్లి తర్వాత వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీలు నాగబాబు కుటుంబం నుంచి విడిపోయి వేరుగా ఉంటారట. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే ఈ విషయాన్ని స్వయంగా నాగబాబు చెప్పడం గమనార్హం. గతంలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో నాగబాబు ‘వరుణ్ తేజ్ పెళ్లితో నాకు ఎలాంటి సంబంధం లేదు. వాడి పెళ్లి విషయం స్వయంగా వాడే ప్రకటించుకుంటాడు’ అని చెప్పాడు.

‘అంతేకాకుండా పెళ్లి తర్వాత వాడు మేం వేరువేరుగా ఉంటాము’ అని నాగబాబు వరుణ్ తేజ్ పెళ్లి కుదరకముందే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. తాజాగా వరుణ్ తేజ్ ఎంగేజ్‌మెంట్‌ అవ్వడంతో గతంలో నాగబాబు చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటున్నారు చాలా మంది. నిజంగానే వరుణ్, లావణ్య పెళ్లి తరువాత నాగబాబు కుటుంబం మూడు ముక్కలు అవ్వబోతుందని సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే నిహారిక నాగబాబుకి దూరంగా ఉంటుంది. ఎందుకంటే చైతన్యతో విడాకులు తీసుకోకుండా ఉండటానికి నిహారికని ఒప్పించడానికి నాగబాబు ఎంతగానో ప్రయత్నించారట. కానీ నిహారిక తండ్రి మాటని ఏ మాత్రం లెక్క చెయ్యకుండా వేరే ఫ్లాట్ తీసుకుని నాగబాబుకి దూరంగా ఉంటుందని సమాచారం.

ఇక వరుణ్, లావణ్య లు పెళ్లి తరువాత ఉండటానికి ఒక ఎక్స్‌పెన్సివ్ భవనాన్ని ఎప్పుడో కొనుగోలు చేసినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. వరుణ్, లావణ్యని పెళ్లి చేసుకున్న తరువాత ఆ బంగ్లాలోనే కాపురం ఉంటారని తెలుస్తుంది. ఇక ఇప్పటికే నిహారిక వేరుగా ఉంటుంది. దాంతో నాగబాబు కుటుంబంలోని ముగ్గురు మూడు కుటుంబాలుగా చీలిపోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అసలు ఈ వార్తలో వాస్తవం ఎంత ఉందో తెలియాలి అంటే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల పెళ్లి వరకూ ఆగాల్సిందే.