టాలీవుడ్ నుంచి మెల్లిగా తరలిపోతున్న స్టార్ హీరోయిన్లు.. కారణమిదే..

ఒకప్పుడు హీరోయిన్స్ అంటే ఏడాదికి రెండు మూడు సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించేవారు. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్స్ జోరు తగ్గిందనే చెప్పాలి. వీరు వచ్చిన ప్రతీ ప్రాజెక్ట్ ఓకే చెయ్యకుండా ఆచితూచి అడుగేస్తు తమ తగిన కథను ఎంచుకుంటున్నారు. ఇక కొంతమందేమో అవకాశాలు రాక ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అలా ఎన్నో కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరం అవుతున్న హీరోయిన్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

• కృతి శెట్టి:

కృతి శెట్టి ‘ఉప్పెన’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ అమ్మడు నటించిన మొదటి సినిమానే బ్లాక్‌బస్టర్ హిట్ కావటంతో కృతి శెట్టి చెంతకు వరుస అవకాశాలు వచ్చి చేరాయి. కానీ ఈ అమ్మడు నటించిన సినిమాలు అన్ని వరుసగా ప్లాప్ అవుతూ వచ్చాయి. చివరిగా కృతి శెట్టి ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘కస్టడీ ‘ ఎదురు తన్నింది. దాంతో ఈ అమ్మడుకి అవకాశాలు బాగా తగ్గిపోయాయి. తెలుగులో అవకాశాలు తగ్గడం తో కృతి శెట్టి అడుగులో కోలీవుడ్, మాలీవుడ్ వైపు వెళ్తున్నాయని సమాచారం.

• పూజా హెగ్డే:

‘ఒక లైలా కోసం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన పూజా హెగ్డే ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. టాలీవుడ్‌లో ఒకప్పుడు గోల్డెన్ లెగ్ హీరోయిన్‌గా నిలిచిన పూజకి ఇప్పుడు బ్యాడ్ టైమ్ నడుస్తుంది. ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకెళ్లిన పూజ హెగ్డే చేతిలో ప్రస్తుతం త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్ లో వచ్చే మూవీ తప్ప ఇంకొకటి లేదు. తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఈ అమ్మడు నటించిన సినిమాలు ప్లాప్ అవ్వడంతో అక్కడ కూడా అవకాశాలు తగ్గిపోయాయి. ఇక ఫ్యూచర్‌లో పూజ పరిస్థితి ఏమవుతుందోనని ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు.

• సాయి పల్లవి:

‘ఫిదా’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు సాయి పల్లవి పరిచయం అయ్యింది. ఈ ముద్దుగుమ్మ ఒక ఏడాది నుంచి టాలీవుడ్‌కి దూరంగా ఉంటుంది. గత ఏడాది వచ్చిన డబ్బింగ్ సినిమా గార్గితో ప్రేక్షకులను పలకరించిన సాయి పల్లవి మంచి ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తుంది. మంచి ప్రాజెక్ట్ తగిలితేనే టాలీవుడ్ లోకి రి ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది. ఇలా చాలా మంది హీరోయిన్స్ మంచి ప్రాజెక్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.