మెగాస్టార్ చిరంజీవికి ఆయన పెద్ద కూతురు సుష్మిత కొణిదెల బిగ్ షాకిచ్చింది. కాస్ట్యూమ్ డిజైనర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సుస్మిత.. ఇటీవలె నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. భర్త విష్ణు ప్రసాద్ తో కలిసి `గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్` అనే ప్రొడెక్షన్ హౌస్ ను స్థాపించింది. సేనాపతి, శ్రీదేవి శోభన్బాబు వంటి చిత్రాలను తన బ్యానర్ లో నిర్మించింది. కానీ, ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.
అయితే ఈసారి తండ్రి చిరంజీవి సినిమాను నిర్మించేందుకు సుస్మిత సిద్ధం అవుతోంది. ప్రస్తుతం `భోళా శంకర్` తో బిజీగా ఉన్న చిరంజీవి.. బింబిసారా డైరెక్టర్ వశిష్ట తో ఓ మూవీ, బంగార్రాజు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తో ఓ సినిమా చేసేందుకు కమిట్ అయ్యాడు. కళ్యాణ్ కృష్ణ-చిరంజీవి కాంబోలో తెరకెక్కబోయే చిత్రాన్ని సుస్మిత నిర్మించబోతోందని వార్తులు వస్తున్నాయి.
అయితే తాజాగా సుస్మితకు టాలీవుడ్ కు చెందిన బడా నిర్మాతల నుంచి ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. మొత్తం ఇన్వెస్ట్మెంట్ మేమే చేస్తాము.. కేవలం లాభాల్లోనే మాకు వాటా ఇవ్వండి అంటూ సుస్మితకు ఆఫర్ ఇచ్చారట. చిరంజీవికి కూడా ఆఫర్ నచ్చడంతో.. సుస్మితను ఓకే చెప్పమని అడిగారట. కానీ, ఆ ఆఫర్ ను సుస్మిత రిజెక్ట్ చేసిందట. లాభాలు వచ్చినా, నష్టాలు వచ్చినా.. నాన్నతో నిర్మించబోయే ఫస్ట్ సినిమాకు మొత్తం తానే పెట్టుబడులు పెడతానని చెప్పేసిందట. తండ్రి మాట లెక్కచేయకుండా మొండిగా వ్యవహరించిందని గుసగుసలు వినిపిస్తోంది. ఇకపోతే చిరంజీవి చిన్నకూతురు రెండు సార్లు విడాకులు తీసుకుంది. ప్రస్తుతం ఆమె పిల్లలతో సింగిల్ లైఫ్ ను లీడ్ చేస్తోంది.